ఆ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలి

జనగామలోని మహిళా పురపాలక కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక ఆర్డీవోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణలు డిమాండ్‌ చేశారు.

Published : 07 Dec 2022 04:32 IST

టీజీవోల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జనగామలోని మహిళా పురపాలక కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక ఆర్డీవోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణలు డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, ఇలాంటి చోట ఒక మహిళా అధికారిపై ఆర్డీవో ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని