నేడు జగిత్యాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాలలో పర్యటించనున్నారు.

Published : 07 Dec 2022 04:46 IST

కలెక్టరేట్‌, తెరాస కార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం
వైద్య కళాశాల భవనానికి భూమిపూజ..

ఈనాడు, కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాలలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని, ధరూర్‌ క్యాంప్‌ సమీపంలో నిర్మించిన తెరాస కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మోతె వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, జిల్లా అధికారులు మంగళవారం పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాలకు చేరుకోనున్న సీఎం సాయంత్రం 4.15 గంటలకు సభ ముగిసిన తరువాత తిరుగుపయనం కానున్నారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర బుధవారం సాయంత్రం మల్లాపూర్‌ మండలం ఓబులాపూర్‌ వద్ద జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలో సీఎం సభ, సంజయ్‌ పాదయాత్ర ఒకేరోజు ఉండటంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని