మూసిన గనుల సమీపంలో కుంగిన భూమి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సౌత్, క్రాస్కట్ భూగర్భ గనుల సమీపంలో సోమవారం రాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కుంగింది.
నిర్వహణకు నీళ్లొదిలిన నేపథ్యం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
దరికి రావద్దంటూ సింగరేణి అధికారుల హెచ్చరికలు
బెల్లంపల్లి పట్టణం, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సౌత్, క్రాస్కట్ భూగర్భ గనుల సమీపంలో సోమవారం రాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కుంగింది. ఎస్టేట్ సిబ్బంది మళ్లీ బోర్డు ఏర్పాటుచేసి సమీపానికి ప్రజలు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 47 ఏళ్ల క్రితం సింగరేణి ఆధ్వర్యంలోని సౌత్, క్రాస్కట్ భూగర్భ గనులను మూసివేశారు. 1995-96 వరకు క్రాస్కట్లో ఆరు పంపులతో నీళ్లు తోడి బయటకు పంపేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత నిర్వహణను సింగరేణి సంస్థ గాలికి వదిలేయటంతో చుట్టూ అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. గని లోపలికి వెళ్లే, బయటకు వచ్చే మార్గాలు తప్ప అంతా ఆక్రమణకు గురైంది. గత వర్షాకాలంలో భారీవర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు ప్రవాహంలా ఉబికి వచ్చాయి. ఆ సమయంలో సింగరేణి అధికారులు ప్రమాదం సూచించే బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. తాజాగా సోమవారం రాత్రి సమయంలో భూమి మళ్లీ ఒక్కసారిగా కుంగడంతో నీళ్లు పైకి కనిపిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో సింగపూర్ సీజేఐ
-
Politics News
Nara Lokesh-yuvagalam: లోకేశ్ బహిరంగసభను అడ్డుకున్న పోలీసులు.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత
-
Movies News
Samantha: ఎనిమిది నెలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా: సమంత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి