దర్యాప్తును కోర్టులు నిరోధించరాదు
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని.. ఈ దశలో దర్యాప్తును కోర్టులు నిరోధించరాదని, ఆ హక్కు కోర్టులకు ఉండదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్దవే హైకోర్టుకు నివేదించారు.
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ప్రాథమిక దశలోనే ఉంది
నిందితులకు విచారణ సంస్థను ఎంచుకునే హక్కులేదు
సిట్ తరఫున హైకోర్టులో దుష్యంత్దవే వాదనలు
కేసును సీబీఐకి అప్పగించాలన్న భాజపా పిటిషన్పై హైకోర్టు విచారణ
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని.. ఈ దశలో దర్యాప్తును కోర్టులు నిరోధించరాదని, ఆ హక్కు కోర్టులకు ఉండదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్దవే హైకోర్టుకు నివేదించారు. అభియోగ పత్రం దాఖలు చేశాకే కోర్టుల పాత్ర ఉంటుందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ భాజపా తరఫున పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మంగళవారం వాదనలు విన్నారు. దీనిపై తదుపరి విచారణ బుధవారం కొనసాగనుంది.
సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘‘న్యాయపరమైన రక్షణ నిందితుడికి ఎప్పుడూ ఉంటుంది. కింది కోర్టులో డిశ్ఛార్జి పిటిషన్, కేసు కొట్టివేయాలని పిటిషన్లు వేసుకోవచ్చు. ఇవన్నీ దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలు చేసిన తరువాతే. దర్యాప్తు దశలోనే కోర్టును ఆశ్రయించి హైకోర్టుకు ఉన్న విచక్షణాధికారాన్ని వినియోగించుకోవాలని కోరడం సరికాదు. రాజకీయపరమైన దురుద్దేశాలతో కేసు నమోదు చేశారని చెప్పడం సరిపోదు. దర్యాప్తును సీబీఐతో జరిపించాలని నిందితులే సూచిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు నిందితులకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరం సమయంలో డబ్బు దొరకలేదన్న కారణంగా ముడుపుల కేసు కాదనడం సరికాదు. ఓటరును ప్రలోభపెట్టిన కారణంగా ఓ ఎన్నికను రద్దు చేస్తూ జస్టిస్ కృష్ణఅయ్యర్ తీర్పు వెలువరించారు. ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు ఇక్కడ ఆధారాలున్నాయి. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మౌలికాంశాలు. వీటిని ధ్వంసం చేసే పరిస్థితి కల్పించినవారికి అదే రాజ్యాంగంలోని అధికరణ 226 కింద రక్షణ కల్పించడానికి వీల్లేదు. పార్టీ ఫిరాయింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్టీలు మారుతున్నారని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చినా ఉపయోగం ఉండడంలేదు. ఓటర్లు అందరూ తమ ప్రతినిధిగా ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు.. అతను అమ్ముడుపోతే ఓటరు గొంతు మూగపోయినట్లే. అది ప్రజల హక్కులను కాలరాసినట్లే. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ప్రజాప్రతినిధులను తీసుకువస్తూ చట్ట సవరణ జరిగింది. సీఆర్పీసీ 41ఎ కింద అరెస్ట్ చేయవచ్చు. నిందితుల సంభాషణ 3గంటలపాటు రికార్డు ఉంది. దిల్లీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు. నిందితులతో పార్టీకి సంబంధం లేదంటూనే వారిపై కేసును కొట్టివేయాలని కోర్టుకు వస్తున్నారు. పిటిషన్ వేసే అర్హత పార్టీకి లేదు. సీబీఐ దర్యాప్తుపై కూడా ఆరోపణలున్నాయి’’ అని వివరించారు.
సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు: శ్రీనివాస్
ఈ కేసులో ఫిర్యాదుదారులు, సాక్షులు, మధ్యవర్తులు, దర్యాప్తుదారులు అందరూ పోలీసులేనని శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హొళ్ల తెలిపారు. ‘‘నా క్లయింట్ సాక్షి మాత్రమే. అయినా నిందితుడికి జారీ చేసే 41ఎ కింద నోటీసు ఇచ్చారు. 30 మంది పోలీసులు వచ్చి ఇంటికి నోటీసు అతికించి దాన్ని పత్రికల్లో ప్రచురించారు. నా క్లయింట్ రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్ పేరు చెప్పాలని ఆయనను ఒత్తిడి చేశారు. విచారణ వీడియో రికార్డింగ్ను బయటపెడితే వారు ఎలా ఒత్తిడి చేశారో తెలుస్తుంది. సీఎం మీడియా సమావేశం నిర్వహించి దర్యాప్తుపై సూచనలు చేస్తుంటారు. నా క్లయింట్పై ఆరోపణలు ఏమిటో చెప్పలేదు. వృత్తిలో భాగంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే నేరం చేసినట్లు వేధింపులకు గురిచేస్తున్నారు. కేసును కొట్టివేయాలనడంలేదు. పారదర్శకమైన దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలి’’ అని పేర్కొన్నారు.
సీఎంకు నోటీసులు ఇవ్వాలన్న తుషార్ న్యాయవాది.. ఏఏజీ అభ్యంతరం..
పిటిషన్లో సీఎం 7వ ప్రతివాదిగా ఉన్నారని, ఆయనకు నోటీసులు ఇచ్చి కౌంటరు దాఖలుకు ఆదేశించాలని తుషార్ తరఫు సీనియర్ న్యాయవాది కోరారు. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎంకు నోటీసులు ఇవ్వడంపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని, వాటిపై వాదనలు వినిపిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!