EPFO: అధిక పింఛన్ అందేదెన్నడో..
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లు’ తయారైంది ఉద్యోగులు, పింఛన్దారుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎఫ్ చందాదారులకు అవకాశం కల్పిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడి నెల రోజులు
నిబంధనలు జారీ చేయని ఈపీఎఫ్ఓ
ఆందోళనలో చందాదారులు
ఈనాడు, హైదరాబాద్: ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లు’ తయారైంది ఉద్యోగులు, పింఛన్దారుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎఫ్ (EPF) చందాదారులకు అవకాశం కల్పిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇది జరిగి నెల రోజులు దాటింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నిబంధనలను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) (EPFO) ఇప్పటివరకు జారీ చేయలేదు. దీంతో అధిక పింఛన్ వస్తుందన్న ఆశ ఎప్పుడు ఫలిస్తుందోనని చందాదారులు ఆందోళన చెందుతున్నారు.
సుప్రీం వెసులుబాటు కల్పించినా..
ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్)లో ఏటా 27.95 కోట్ల మంది చందాదారులు చందా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 72.73 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఈపీఎస్ కింద ఏటా చెల్లించే వాటా రూ.50 వేల కోట్లు ఉండగా.. పింఛన్ల కోసం ఈపీఎఫ్ఓ రూ.20 వేల కోట్ల వరకు వెచ్చిస్తోంది. ప్రస్తుత పింఛన్దారుల్లో 95 శాతం మందికి నెలకు రూ.2వేల లోపే సొమ్ము అందుతోంది. వారు కొన్నేళ్లుగా అధిక పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ఓతో పాటు ఆర్థికశాఖ ఈపీఎస్ నిధుల్లో లోటును సాకుగా చూపిస్తోంది. మరోవైపు అధిక వేతనాలు పొందుతున్నవారు పింఛన్ నిధికి ఎక్కువ మొత్తంలో చెల్లించినా.. ఆ మేరకు ఎక్కువ పింఛన్ తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేయాలి. ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచింది. దీనికి ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధిక వేతనంపై ఈపీఎస్లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యనిధి పింఛన్ పథకం- 2014 సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛన్ పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. 2014 సవరణకు ముందు అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎస్లో చేరనివారికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సుప్రీంతీర్పు ఇచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. అయినా ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు నిబంధనలు వెలువరించలేదు. అధిక పింఛన్పై ఆశతో విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగులు ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లి సంప్రదిస్తున్నారు. అయితే కేంద్ర పీఎఫ్ కార్యాలయం నుంచి నిబంధనలు వచ్చేవరకు ఏమీ చెప్పలేమంటూ వారిని సిబ్బంది తిప్పిపంపుతున్నారు.
ఈపీఎస్ నిధులపై మదింపు!
పింఛన్ మొత్తం పెంచాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఉద్యోగుల పింఛన్ నిధిలో జమ అవుతున్న నిధులపై మదింపు చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఏటా వసూలవుతున్న చందా నిధులు, చెల్లిస్తున్న పింఛన్ సొమ్మును బట్టి భారం అంచనా వేయాలని సూచించింది. ఎనిమిదేళ్ల క్రితం కనీస వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచిన నేపథ్యంలో.. ఆ తర్వాతి నుంచి ఏటా పడుతున్న భారాన్ని లెక్కించాలని సూచించింది. అధిక వేతనం పొందుతూ ఆ మేరకు పింఛన్ నిధి చెల్లించినవారికి అధిక పింఛన్ ఇవ్వడం వల్ల ఈపీఎఫ్ఓపై పడే భారాన్ని పరిశీలించనుంది. దీంతో పాటు పింఛన్ను లెక్కించేందుకు సగటు వేతనాన్ని 24 నెలలు.. 30.. 36.. 60 నెలలకు పరిశీలించి, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఇవ్వాలని సూచించింది. అవసరమైతే ఇప్పటివరకు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అదనంగా ఇస్తున్న రెండేళ్ల బోనస్ సర్వీసు తొలగింపు, ముందస్తు పింఛన్ వయోపరిమితిని 50 నుంచి 55 ఏళ్లకు పెంచడం తదితర విషయాలను పరిశీలించి నివేదిక తెప్పించుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM