కొలిక్కివచ్చిన రింగురోడ్డు దక్షిణ భాగం
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుకు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగం రహదారి ప్రణాళిక (అలైన్మెంట్) కొలిక్కి వచ్చింది.
క్షేత్రస్థాయిలో పూర్తయిన అధ్యయనం..కేంద్రానికి చేరిన నివేదిక
రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తుది మార్పులు పూర్తి
347 కిలో మీటర్లు దాటిన ప్రాంతీయ రింగు రోడ్డు
నెలాఖరులోగా కేంద్రం పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుకు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగం రహదారి ప్రణాళిక (అలైన్మెంట్) కొలిక్కి వచ్చింది. 189.23 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధ్యయనంలో నిర్ధారించినట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దూరంతో పోలిస్తే 7.37 కిలోమీటర్లు పెరిగింది. భారత్మాల పరియోజన పథకం కింద ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించటంతో దక్షిణ భాగం అలైన్మెంటు ప్రతిపాదనలను దిల్లీకి చెందిన ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ లిమిటెడ్’ సంస్థ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు అందచేసింది.
రెండు భాగాలుగా..
ప్రాంతీయ రింగు రోడ్డును రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం భూ సేకరణ తుది దశలో ఉంది. దక్షిణ భాగం మార్గాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం మూడు నెలల కిందట గుత్తేదారును ఎంపిక చేసింది. క్షేత్రస్థాయిలో ఆ సంస్థ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ముసాయిదా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మూడు, నాలుగు ప్రాంతాల్లో ఉన్న నీటి రిజర్వాయర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రహదారి ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించటంతో ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి కేంద్రానికి నివేదించింది. ప్రాంతీయ రింగు రోడ్డు దూరం 347.87 కిలోమీటర్లకు చేరుకుంది. గతంలో ఉత్తర భాగాన్ని 158.416 కిలోమీటర్లుగా ప్రతిపాదించారు. అతి స్వల్పంగా పెరిగి 158.645 కిలోమీటర్లకు చేరింది. ఆ మేరకు భూ సేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దక్షిణ భాగం అధ్యయనం పూర్తి అయింది. గతంలో 181.864 కిలోమీటర్లుగా ప్రతిపాదించగా ప్రస్తుతం ఆ మార్గం 189.23 కిలోమీటర్లకు పెరిగింది. దక్షిణ భాగం కంది, నవాబ్పేట, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, ఆమనగల్లు, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణ్పూర్ మీదుగా చౌటుప్పల్కు కలుస్తుంది. ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్కు చేరుతుంది. దక్షిణ భాగానికి సంబంధించి కేంద్రం నుంచి తుది నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఆ మార్గానికి సంబంధించి మూడు ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి కన్సల్టెన్సీ సంస్థ అందచేసింది. వీటిలో ఒకదానిని నెలాఖరులోగా ఖరారు చేసేందుకు కేంద్రం పరిశీలించనుందని సమాచారం.
త్వరలో జాతీయ రహదారి నంబరు?
ప్రాంతీయ రింగు రోడ్డులో ఉత్తర భాగానికి మాత్రమే ఇప్పటివరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి తాత్కాలిక నంబరును కేటాయించింది. దక్షిణ భాగానికి నంబరు కేటాయించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా అలైన్మెంట్ వ్యవహారం కొలిక్కి వస్తుందని సమాచారం. అధికారిక నోటిఫికేషన్ జారీ చేయటానికి ముందుగానే దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించనుంది. మంత్రిత్వ శాఖలో ఇందుకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. నంబరు కేటాయింపుతోపాటు అలైన్మెంటు ఖరారు చేస్తూ గజిట్ నోటిఫికేషన్ వెలువడిన తరవాత భూ సేకరణ ప్రక్రియను రూపొందించేందుకు అవసరమైన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇప్పటికే ఉత్తర భాగంలో భువనగిరి, చౌటుప్పల్ మినహా మిగిలిన ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాల్లో అధికారులు ఇటీవలివరకు తలమునకలుగా ఉండటంతో భూసేకరణ తాత్కాలికంగా నిలిచింది. త్వరలో ఆ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అలైన్మెంట్ ఖరారు తరవాత దక్షిణ భాగం భూ సేకరణ ప్రక్రియ కసరత్తు మొదలవుతుంది. మొత్తమ్మీద ప్రాంతీయ రింగురోడ్డు వ్యవహారాల దస్త్రాలు చకచకా కదులుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా