సంక్షిప్త వార్తలు(7)
హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ గ్లోబల్ మీట్’ను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.వీరేశం, అలుమ్నీ మేనేజింగ్ ట్రస్టీ డా.ఎన్.కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు.
ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ’ 11న
సుల్తాన్బజార్, న్యూస్టుడే: హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ గ్లోబల్ మీట్’ను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.వీరేశం, అలుమ్నీ మేనేజింగ్ ట్రస్టీ డా.ఎన్.కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రతి రెండేళ్లకోసారి గ్లోబల్ మీట్ను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి: ట్రెసా
ఈనాడు, హైదరాబాద్: ఆర్డీవో మధుమోహన్ తనను అవమానపరుస్తున్నారని ఇటీవల అక్కడి పురపాలక కమిషనర్ రజిత కళ్లనీళ్లు పెట్టుకున్న ఘటనపై కొంతమంది నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదని ట్రెసా అభిప్రాయపడింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై కొందరు ఏకపక్షంగా మాట్లాడడం తగదని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.
సైనిక దళాల పతాక నిధికి విరాళాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లు భారత సైనిక దళాల పతాక నిధికి విరాళాలు అందజేశారు. బుధవారం రాజ్భవన్, బీఆర్కే భవన్, హోంమంత్రి నివాసంలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వారు సైనిక సంక్షేమ శాఖ అధికారులకు విరాళాలు అందజేసి దేశరక్షణలో అసువులుబాసిన సైనికులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సైనిక సంక్షేమ శాఖ సంచాలకుడు కల్నల్ పి.రమేశ్కుమార్, హైదరాబాద్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి: ట్రెసా
ఈనాడు, హైదరాబాద్: ఆర్డీవో మధుమోహన్ తనను అవమానపరుస్తున్నారని ఇటీవల అక్కడి పురపాలక కమిషనర్ రజిత కళ్లనీళ్లు పెట్టుకున్న ఘటనపై కొంతమంది నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదని ట్రెసా అభిప్రాయపడింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై కొందరు ఏకపక్షంగా మాట్లాడడం తగదని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ అకాడమీ సోదాల్లో 53 దస్తావేజుల స్వాధీనం: ఈడీ
ఈనాడు, దిల్లీ: ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిపిన సోదాల సందర్భంగా చరాస్థులకు సంబంధించిన 53 దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు సంబంధించిన కొంతమంది సభ్యులు, పదాధికారులపై పీఎంఎల్ఎ-2002 కింద నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఈనెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకొని ఈ కేసులో భాగస్వాములైన వివిధ వ్యక్తుల ఆస్తులను జప్తు చేశారు.
బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు నేటి నుంచి రెండోవిడత కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈనెల 8న ఉదయం 9 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండోవిడత ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
‘బిగ్ సి’ వార్షికోత్సవ ఆఫర్లు
ఈనాడు, అమరావతి: ‘బిగ్ సి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ లక్కీ డ్రా ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు తమ వద్ద స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్టాప్ కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీడ్రా నిర్వహిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. ‘‘విజేతలకు 20 కార్లు, 20 ద్విచక్రవాహనాలు, 20 ఏసీలు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 టీవీలు బహుమతిగా ఇస్తాం. మొబైల్ ఫోన్ కొనుగోలుపై బహుమతి, 10శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా కొనుగోలు చేసే సౌకర్యం ఉంది. స్మార్ట్టీవీ, ల్యాప్టాప్, యాక్సెసరీస్ కొనుగోలుపైనా బహుమతి ఉంటుంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ