247 పాలిటెక్నిక్‌ అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 247 అధ్యాపకుల ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 08 Dec 2022 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 247 అధ్యాపకుల ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు. అర్హులైన అధ్యాపకులు ఈనెల 14వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ తెలిపింది. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గత జులై 23న జీవో జారీ చేసింది. ఆనాడు 247 అధ్యాపక ఖాళీలతోపాటు 14 జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రేరియన్‌, 37 ఫిజికల్‌ డైరెక్టర్‌, 25 ఎలక్ట్రీషియన్‌, అయిదు మ్యాట్రన్ల కొలువును భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. అంటే ఇంకా 112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని