రెండో రోజూ ఆదాయ పన్ను సోదాలు

రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌లో రెండోరోజైన బుధవారం కూడా ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించింది.

Published : 08 Dec 2022 05:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌లో రెండోరోజైన బుధవారం కూడా ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించింది. కార్యాలయాలు, భాగస్వాముల ఇళ్లు, సంస్థకు అనుబంధంగా ఉన్న ఒక హోటల్‌లోనూ ఈ సోదాలు జరిగాయి. ఛైర్మన్‌ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లను తెరిపించారు. కొన్ని పత్రాలు, కొంత నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కావురి హిల్స్‌లోని జుబ్లీరిడ్జ్‌ హోటల్‌లోని రికార్డులనూ అధికారులు పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారెడ్డి ఇంట్లో కొందరు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైనట్లు, వీరికి వెంటనే వైద్యులను పిలిపించి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని