న్యాయమూర్తుల బదిలీలను నిలిపివేయాలి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు.
ఏపీ హైకోర్టు వద్ద న్యాయవాదుల ర్యాలీ
ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు. బదిలీలను తక్షణం నిలిపివేయాలని నినాదాలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు కొలీజియం పునరాలోచన చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని నినదించారు. అడ్వొకేట్స్ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు (వైకే), జడా శ్రావణ్కుమార్, డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ క్యాంటిన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం