ముంపు ముప్పు తప్పేలా..!
గోదావరికి గత జులైలో వచ్చిన భారీ వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్కు జరిగిన నష్టం పునరావృతం కాకుండా నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది.
దెబ్బతిన్న కన్నెపల్లి-అన్నారం కాలువకు మరమ్మతులు
అన్నారం పంపుహౌస్కు రక్షణగా మట్టికట్ట స్థానంలో సిమెంటు గోడ
నిర్మాణ పనులపై ఇంజినీర్ల ప్రతిపాదనలు
కసరత్తు ఆరంభించిన నీటిపారుదల శాఖ
ఈనాడు హైదరాబాద్: గోదావరికి గత జులైలో వచ్చిన భారీ వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్కు జరిగిన నష్టం పునరావృతం కాకుండా నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. మొదటి పంపుహౌస్ కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజిలో చేరేందుకు నిర్మించిన కాలువ అనేక చోట్ల దెబ్బతింది. దాన్ని బాగుచేయడంతో పాటు అన్నారం పంపుహౌస్ మళ్లీ నీట మునగకుండా మట్టికట్ట స్థానంలో సిమెంటు కాంక్రీటు నిర్మాణం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించిన ఇంజినీర్లు ప్రతిపాదనలను నీటిపారుదల శాఖ అధికారులకు పంపినట్లు తెలిసింది. డిజైన్లలో లోపాలను సవరించి మళ్లీ ఇలాంటి సమస్యలు రాకుండా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ)కు తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది.
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మొదటి పంపుహౌస్ను కన్నెపల్లి వద్ద నిర్మించగా, దీని నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజికి చేరేందుకు నిర్మించిన కాలువ గత జులైలో భారీ వరద కారణంగా 24చోట్ల దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. పనుల్లో నాణ్యతలోపాలు, డిజైన్లో సమస్యలు దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదొక ఎత్తయితే, వచ్చే సీజన్లో మళ్లీ నీటిని ఎత్తిపోయాలంటే ఈ కాలువ మరమ్మతును సత్వరం పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చే వర్షాకాలంలో మరింత దెబ్బతినే అవకాశం ఉంది. సీడీఓ పరిశీలన తర్వాత ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రక్షణగా వేసిన మట్టికట్టపై నుంచి నీరు లోపలకు ప్రవేశించడం, కట్ట కోతకు గురికావడం తదితరాలతో పాటు గరిష్ఠ వరద మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వంటి కారణాల వల్ల అన్నారం పంపుహౌస్ నీట మునిగింది. ఈ నీటిని తోడి పంపులను బయటకు తీసి, నాలుగింటికి మరమ్మతుల అనంతరం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. మిగిలిన పంపులు నడపాల్సి ఉంది. మరోవైపు 2023లో మళ్లీ భారీ వరద వస్తే సమస్య తలెత్తకుండా పంపుహౌస్కు రక్షణగా సిమెంటు కాంక్రీటు(సీసీ) గోడను నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 800 మీటర్ల పొడవునా నిర్మించే ఈ గోడను 134 మీటర్ల మట్టం వరకు నీరొచ్చినా ఇబ్బంది లేకుండా కట్టాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇది కూడా నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. పంపుహౌస్ ప్రెషర్మెయిన్లు నీళ్లలో మునిగి ఉండటంతో పాటు వాటిపైన మట్టి కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ఏమైనా నష్టం వాటిల్లే అవకాశముందా అన్నదానిపై నిపుణులతో అధ్యయనం చేయించినట్లు తెలిసింది. ట్రాన్స్కో సైతం కొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.25కోట్లు చెల్లిస్తే కానీ ఇవి పూర్తిచేయలేని పరిస్థితి ఉండటంతో ఈ మొత్తం సమకూర్చడానికి నీటిపారుదల శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అన్ని పంపులు పూర్తిస్థాయిలో నడవాలంటే ట్రాన్స్కో కూడా కొన్ని పనులు పూర్తిచేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ