తెలుగు రాష్ట్రాల్లో మరో 255 బ్యాటరీ ఛార్జింగ్ కేంద్రాలు
విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దశలవారీగా అన్ని ఐఓసీ పెట్రోలు బంకుల్లో వ్యక్తిగత వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అనిల్కుమార్ చెప్పారు.
వచ్చే మార్చిలోగా ఏర్పాటు
‘ఈనాడు’తో ఐఓసీ తెలంగాణ, ఏపీ ఈడీ అనిల్కుమార్
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దశలవారీగా అన్ని ఐఓసీ పెట్రోలు బంకుల్లో వ్యక్తిగత వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అనిల్కుమార్ చెప్పారు. స్లో, స్పీడ్ ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని.. జాతీయ రహదారుల్లోని బంకులకు ప్రాధాన్యముంటుందని పేర్కొన్నారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి తెలంగాణలో 223, ఆంధ్రప్రదేశ్లో 264 కలిపి.. మొత్తం 487 అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 232 ఏర్పాటయ్యాయి. మార్చిలోగా మరో 255 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 200 స్లో, 287 స్పీడ్ ఛార్జింగ్ కేంద్రాలు రానున్నాయి. స్లో కేంద్రాల్లో ద్విచక్ర వాహనం బ్యాటరీ ఛార్జింగ్కు 15-30 నిమిషాలు, కారుకు గంట నుంచి గంటన్నర వ్యవధి పడుతుంది. స్పీడ్ కేంద్రాల్లో ద్విచక్ర వాహనానికి 10 నిమిషాలు, కారుకు 15-20 నిమిషాలు పడుతుంది.
తిరుమలలో వంట గ్యాస్ ప్లాంటు
కూరగాయల వ్యర్థాల నుంచి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసే విధానాన్ని మా పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) విభాగం రూపొందించింది. తొలి ప్లాంటును తిరుమల కొండపై ఏర్పాటు చేయనున్నాం. తితిదేతో ఒప్పందం చేసుకున్నాం. నిర్మాణ వ్యయాన్ని ఐఓసీ, తితిదే సమానంగా భరిస్తాయి. తిరుమలలో రోజుకు 40-60 టన్నుల కూరగాయల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వాటి నుంచి రోజుకు 1-2 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇందులో వచ్చే ఉప ఉత్పత్తులను సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగిస్తాం. ప్లాంటు కోసం స్థలాన్ని గుర్తించే పని సాగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 6-8 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తవుతుంది అని అనిల్కుమార్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?