కనులపండువగా పౌర్ణమి గరుడసేవ

శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.

Published : 09 Dec 2022 04:50 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ గరుత్మంతునిపై సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు అభయ ప్రదానం చేశారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, వీజీవో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌, పారుపత్తేదారు ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు