Nanda Kumar: వెలుగులోకి నందు అక్రమాల చిట్టా!
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ అలియాస్ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది.
పదుల సంఖ్యలో చెల్లని చెక్కుల గుర్తింపు
పూజలతో ప్రముఖులను బుట్టలో వేసుకొని లబ్ధి పొందినట్లు సమాచారం
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ అలియాస్ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది. అతడి బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విశ్లేషణలో.. పలువురితో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నందు ఇచ్చిన చెక్కులు పదుల సంఖ్యలో బౌన్స్ అయినట్లు ఇప్పటికే సిట్ గుర్తించినట్లు తెలిసింది. నందుతో గతంలో ఇబ్బందులకు గురైన బాధితులు.. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములుగా ఉండి విబేధాల కారణంగా బయటికి వచ్చినవారు, ఆయనతో ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చే ఆధారాలను పరిశీలిస్తూ నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెరపైకి గుట్కా సంస్థ వ్యవహారం
నందు ఏడు వ్యాపార సంస్థలను నిర్వహించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతడి మాయమాటలతో మోసపోయినట్లు ఓ గుట్కా సంస్థ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలో ఆ సంస్థ ట్రేడ్మార్క్పై వివాదం తలెత్తగా.. నిర్వాహకులతో మాట కలిపిన నందు, సంస్థ నిర్వహణ సరిగా లేదని.. దాన్ని అమ్మేందుకు రూ.కోట్లలో డీల్ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు సమాచారం. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది.
నందు జాబితాలో ఏడుగురు స్వామీజీలు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందకుమార్తో పాటు రామచంద్రభారతి, సింహయాజి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. రామచంద్రభారతి, సింహయాజిలే కాకుండా నందు జాబితాలో మరో ఏడుగురు స్వామీజీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరున్న రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఎంచుకోవడం.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామీజీలతో పూజలు చేయించడాన్ని నందు వ్యాపకంగా పెట్టుకున్నట్లు గుర్తించారు. స్వామీజీలు హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేయడం.. విమానాశ్రయం నుంచి కారులో తీసుకురావడం.. హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వడం.. పూజల సందర్భంగా తొలుత ప్రముఖుల తరఫున తానే స్వామీజీలకు పెద్దఎత్తున దక్షిణ సమర్పించడం.. తర్వాత అదను చూసి వారితో పనులు చేయించుకోవడం వంటి వ్యవహారాలు భారీగానే జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఏమైనా మోసాలు చోటుచేసుకున్నాయా? అని ఆరా తీసే పనిలో సిట్ నిమగ్నమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా