Hyderabad: నేడు ఆకాశంలో అద్భుతం.. మామూలుగానే చూడొచ్చు!

ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం.. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్‌ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్‌ ఎస్‌.రఘునందన్‌రావు తెలిపారు.

Updated : 14 Dec 2022 08:57 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఖగోళంలో మరో అద్భుతాన్ని వీక్షించే అవకాశం.. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్‌ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్‌ ఎస్‌.రఘునందన్‌రావు తెలిపారు. దీన్ని మామూలు కంటితోనే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇసుక రేణువంత ఉండే ఈ ధూళి రేణువులు భూ వాతావరణాన్ని తాకి కాంతిజ్వాలగా కాలిపోతాయన్నారు. దీన్నే మనమంతా ఉల్కాపాతం అంటామని చెప్పారు.

దీన్ని బుధవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈశాన్యం, తూర్పు వైపు.. మధ్యరాత్రిలో ఆకాశంలో నడినెత్తిన.. సూర్యోదయానికి ముందు పడమర వైపు చూడవచ్చని తెలిపారు. ఇలా డిసెంబరు 17 వరకు కనిపిస్తాయన్నారు. పౌర్ణమి తర్వాత ఏర్పడుతుండటంతో గంటకు 150కిపైగా మెరుపులు వస్తాయని.. మనం 30-40 మాత్రమే చూడగలుగుతామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని