బదిలీలు ముగిసే వరకు సెలవులు ఇవ్వొద్దు
బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయులు నిత్యం హైదరాబాద్ వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో డీఈఓల ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయులు నిత్యం హైదరాబాద్ వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం సూచనల మేరకు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని కొన్ని జిల్లాల్లో డీఈఓలు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ దంపతులు మౌనదీక్షకు దిగడం, 317 జీఓ బాధిత ఉపాధ్యాయులు ప్రగతిభవన్ను ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సోమవారం డీఈఓల సమావేశంలో చర్చ జరిగింది. టీచర్లు హైదరాబాద్ రాకుండా చూడాలని, వారికి సెలవులు ఎందుకు ఇస్తున్నారని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రశ్నించినట్లు తెలిసింది. ఈక్రమంలో టీచర్లు లిఖితపూర్వకంగా సెలవుపత్రాన్ని రాసి... హెచ్ఎంలు/ఎంఈఓల అనుమతి తీసుకొని రావాలని, లేకుంటే సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పలువురు డీఈఓలు ఆదేశాలిచ్చారు. నిజామాబాద్ డీఈఓ అయితే బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యేవరకు సెలవులు ఇవ్వరాదని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?