సచివాలయ ప్రారంభానికి స్టాలిన్, సోరెన్
తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
హాజరుకానున్న ఇద్దరు సీఎంలు
బిహార్ డిప్యూటి సీఎం తేజస్వి కూడా
17న భారీ బహిరంగసభ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇద్దరు సీఎంలు, ఒక ఉప ముఖ్యమంత్రితో సహా ఓ పార్టీ జాతీయాధ్యక్షుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారాస ఆవిర్భావ సభలో ముగ్గురు సీఎంలు సహా ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఇప్పుడు సచివాలయం ప్రారంభానికి కూడా సీఎంలు హాజరుకానున్నారు. పార్టీ అధికార కార్యక్రమానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన కేసీఆర్, ఇప్పుడు సచివాలయ ప్రారంభానికి కాంగ్రెస్తో భాగస్వాములుగా ఉంటున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించడం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకొన్నట్లయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. 2019 జూన్ 27న సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, 2021 జనవరిలో పనులు ప్రారంభించారు. తక్కువ సమయంలోనే అన్ని హంగులతో పూర్తిచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానుండటంతో ఇది జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు, ఝార్కండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, ఆ రాష్ట్ర సీఎం నీతీశ్కుమార్ ప్రతినిధిగా జేడీయూ జాతీయాధ్యక్షుడు లలన్సింగ్ హాజరుకానున్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె