522 ఎకరాలపై ప్రైవేటు కన్ను!
ఒకటా.. రెండా.. రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాలు అవి. కొన్నేళ్ల నుంచి పరాయి వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా తమ అధీనంలోకి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.
కంటోన్మెంట్లో బీ3 బంగ్లాల స్వాధీనానికి కొందరి ప్రయత్నం
బల్దియాలో విలీన ప్రతిపాదన నేపథ్యంలో మళ్లీ చర్చ
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, కంటోన్మెంట్-న్యూస్టుడే: ఒకటా.. రెండా.. రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాలు అవి. కొన్నేళ్ల నుంచి పరాయి వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా తమ అధీనంలోకి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్థలాలను అధికారికంగానే తమ పరం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూబోయినపల్లి, బొల్లారం తదితర ప్రాంతాల్లో సుమారు 117 బీ3 ఓల్డ్గ్రాంట్ బంగ్లాలున్నాయి. ఒక్కో బంగ్లా 2.5-13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఈ బంగ్లాలు, వాటి ప్రాంగణాలు సుమారు 522 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. బ్రిటిష్ సైన్యాధికారుల సౌకర్యార్థం అప్పటి నిజాం భూములివ్వగా వ్యాపారవేత్తలు ఈ బంగ్లాలు నిర్మించారు. బ్రిటిష్ అధికారులు ఇందులో నివాసం ఉండేవారు. స్వాతంత్య్రానంతరం వీటిని అనుభవించే హక్కును(హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్-హెచ్ఓఆర్) బంగ్లా నిర్మాణదారులు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. భూ యాజమాన్య హక్కులు మాత్రం రక్షణ శాఖ అధీనంలోనే ఉంటాయి. నిబంధనల ప్రకారం హెచ్ఓఆర్లు బంగ్లాలను ఇతరులకు విక్రయించడంకానీ, లీజులు, సబ్లీజులకుకానీ ఇవ్వకూడదు. వాటిల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించకూడదు.
రాజకీయ నేతల కనుసన్నల్లో..
నిబంధనలకు విరుద్ధంగా కొందరు హెచ్ఓఆర్లు తమ బంగ్లాలను కొంతమంది రాజకీయ నాయకులు, ఇతరులకు విక్రయించారు. రాష్ట్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హెచ్ఓఆర్ దగ్గర దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న బంగ్లాను అనధికారికంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో కల్యాణ మండపాన్ని నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లా స్థలాల్లో పేరుమోసిన మరికొన్ని ఫంక్షన్హాళ్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వివిధ రకాల కంపెనీలు ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని ప్రైవేటు బస్సుల పార్కింగ్ కేంద్రాలుగా మార్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినందున హెచ్ఓఆర్లపై చర్యలు తీసుకుని ఆ స్థలాలను కంటోన్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఇటీవల సమావేశంలో చర్చ
కంటోన్మెంట్ పాలనపై కొత్త చట్టం తీసుకురావాలని రక్షణ శాఖ నిర్ణయించింది. సంబంధిత ముసాయిదాలో కంటోన్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్(క్లార్)లో బీ3 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలను హెచ్ఓఆర్లకే ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకున్న సమయంలో దేశంలోని కంటోన్మెంట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలనే చర్చ జరిగింది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే విషయమై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ డిసెంబరులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తూ రాష్ట్రం, కేంద్రానికి నిరభ్యంతర పత్రం పంపించడంతో కంటోన్మెంట్లోని పరిస్థితులపై అధ్యయనం చేసి ఫిబ్రవరి 4లోగా సమగ్ర నివేదికను అందించాలని ఆదేశిస్తూ కేంద్రం ఎనిమిదిమందితో కమిటీని నియమించింది. ఇందులో భాగంగానే ఈనెల 16, 17 తేదీల్లో బోర్డు ప్రతినిధులు, పురపాలక, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమయ్యారు. బీ3 బంగ్లాలతో పాటు ఇతరత్రా ఖాళీ స్థలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రస్తుతం గజం రూ.50-80 వేల వరకు ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో 522 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీ3 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలు, అనుబంధంగా ఉన్న స్థలాలను తమకు కేటాయించాలని ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వారికి అప్పగించకుండా స్వాధీనం చేసుకుని కేంద్ర, రాష్ట్ర అవసరాల కోసం వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM