నీటిపారుదల కేటాయింపులకు పరిమితులు?
నీటిపారుదల రంగానికి బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనలపై పరిమితి (సీలింగ్) ప్రభావం చూపుతోంది. ఇటీవల ముఖ్య ఇంజినీర్ల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను ఒకసారి సమర్పించగా.. మార్పులు చేయాలంటూ ఆర్థికశాఖ కొంత మేర సీలింగ్ (పరిమిత మొత్తం) సూచించినట్లు తెలిసింది.
ఈనాడు, హైదరాబాద్: నీటిపారుదల రంగానికి బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనలపై పరిమితి (సీలింగ్) ప్రభావం చూపుతోంది. ఇటీవల ముఖ్య ఇంజినీర్ల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను ఒకసారి సమర్పించగా.. మార్పులు చేయాలంటూ ఆర్థికశాఖ కొంత మేర సీలింగ్ (పరిమిత మొత్తం) సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు తగ్గించి పంపిన ప్రతిపాదనలపై మరోమారు సీలింగ్ విధించినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుల వారీగా నిధులను సర్దుబాటు చేసేందుకు ఇంజినీర్లు కుస్తీ పడుతున్నారు. భారీగా కేటాయింపులుంటాయని భావించిన ప్రాజెక్టులకు కూడా కోతలు పడినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.11 వేల కోట్ల వరకు అవసరమని ఇంజినీర్లు ప్రతిపాదించగా రూ.5,900 కోట్లతో సర్దుకోవాలనే సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలు సమర్పిస్తే.. తాజాగా రూ.2,700 కోట్లకు పరిమితం చేసినట్లు సమాచారం. బ్యాంకులు, ఆర్థికసంస్థల రుణాలకు చెల్లించాల్సిన వడ్డీల కిస్తీలు భారీగానే ఉన్నాయి. రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డికి కూడా కేటాయింపులు తగ్గినట్లు తెలిసింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ఉన్న నాగర్కర్నూల్ సర్కిల్ నుంచి రూ.5 వేల కోట్లకు ప్రతిపాదనలు సమర్పించగా రూ.1700 కోట్లకు సర్దుకోమని మొదట సూచించి.. తాజాగా రూ.1400 కోట్లకు సీలింగ్ పెట్టినట్లు సమాచారం. డిండి, ఏఎమ్మార్పీ ఎస్సెల్బీసీతోపాటు పలు చిన్నతరహా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలున్న నల్గొండ సర్కిల్ నుంచి రూ.9 వేల కోట్లకు ప్రతిపాదనలు వెళ్లగా మొదటి సీలింగ్లో రూ.2000 కోట్లుగా సూచించి తాజాగా రూ.650 కోట్లకు సరిపెట్టినట్లు తెలిసింది. ఇక్కడ భూసేకరణకే ఎక్కువ నిధులు ఖర్చయ్యే పరిస్థితులున్నాయి. వనపర్తి జిల్లాకు మొదట రూ.400 కోట్లు, తాజాగా రూ.180 కోట్లకు పరిమితి విధించినట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో కీలకంగా ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, భూసేకరణ, వరద కాలువ కింద చివరిదశ పనులు కలిపి కరీంనగర్ సర్కిల్ నుంచి రూ.వెయ్యి కోట్లకు ప్రతిపాదనలు పంపగా మొదట రూ.500 కోట్లకు, చివరకు రూ.220 కోట్లకు పరిమితి విధించినట్లు సమాచారం. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న కొత్తగూడెం సర్కిల్కు రూ.వెయ్యి కోట్లు తుది ప్రతిపాదన చేసినట్లు, ఇతర సర్కిళ్ల ప్రతిపాదనల్లోనూ సర్దుబాట్ల ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య