రాజ్భవన్ X రాష్ట్ర ప్రభుత్వం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మరోసారి వివాదం
రాజ్భవన్లోనే ఉదయం 7 గంటలకు వేడుక
ఈనాడు, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్భవన్లోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాయడంతో ఆమె అసహనానికి గురయ్యారని సమాచారం. దీనిపై దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు.. కరోనా కారణంగా పరేడ్ నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, ప్రజలను కూడా అనుమతించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై చర్చించారు. ఆఖరి నిమిషంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేయడానికి ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. చివరకు రాజ్భవన్లోనే పరేడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు.. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం ఏడు గంటలకు రాజ్భవన్లోనే గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నట్లు ఆమె కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఆరుగంటలకు అధికారిక ప్రకటన వెలువడింది.
రెండేళ్లుగా ఇదే తీరు..
గత రెండేళ్లుగా రాజ్భవన్కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరుగుతూ రాగా, కొన్ని నెలలుగా తీవ్రమైంది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై సీఎం, మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, ఎమ్మెల్సీల నియామకంలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసి పంపిన పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టడం, గవర్నర్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ ఏర్పాటు చేయకపోవడం.. వంటివి ఒకదానికొకటి తోడై.. విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చాలాకాలం తర్వాత ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు స్వాగత కార్యకమ్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై కలిసి పాల్గొన్నారు. ఇటీవల కాలంలో తరచూ గవర్నర్ రాష్ట్రప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు మరోసారి వివాదానికి తెరలేపాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్భవన్లోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పది రోజుల కిందటే గవర్నర్కు లేఖ రాసినట్లు తెలిసింది. పాండిచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా వ్యవహరిస్తున్న తమిళిసై బుధవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. గురువారం నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆమె రాజ్భవన్ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఖమ్మంలో అయిదు లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తే లేని కొవిడ్.. పరేడ్ గ్రౌండ్లో రిప్లబిక్డే వేడుకలకు వస్తుందా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. తమిళిసై గురువారం ఉదయం రాజ్భవన్లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన తర్వాత సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లి అక్కడ రిప్లబ్లిక్డే వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. ఇక్కడ జరిగిన పరిణామాలన్నిటినీ ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?