ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్కుమార్కు రాష్ట్రపతి పోలీసు పతకం
తెలంగాణ నిఘా విభాగం అధిపతి అనిల్కుమార్ ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ పతకాని(పీపీఎం)కి ఎంపికయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీఎస్ఎస్పీ) 12వ పటాలం అదనపు కమాండెంట్ బృంగి రామకృష్ణకూ ఈ పతకం దక్కింది.
టీఎస్ఎస్పీ 12వ పటాలం అదనపు కమాండెంట్ రామకృష్ణకు కూడా
రాష్ట్రంలో మరో 13 మందికి ఉత్తమ సేవాపతకాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నిఘా విభాగం అధిపతి అనిల్కుమార్ ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ పతకాని(పీపీఎం)కి ఎంపికయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీఎస్ఎస్పీ) 12వ పటాలం అదనపు కమాండెంట్ బృంగి రామకృష్ణకూ ఈ పతకం దక్కింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే పురస్కారాల్లో మరో 13 మందికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి. పతకాలు లభించిన వారికి డీజీపీ అంజనీకుమార్ అభినందనలు తెలిపారు.
అనిల్కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్నారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆయన 1996 ఐపీఎస్ బ్యాచ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. మావోయిస్టు ప్రభావిత ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేశారు. కర్నూల్ డీఐజీగా, హైదరాబాద్ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం(ఎఫ్ఆర్ఆర్వో) చీఫ్గా విధులు నిర్వర్తించారు. నిఘావిభాగంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవముంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో పనిచేసిన కాలంలో అఫ్గానిస్థాన్లోని ఇండియన్ ఎంబసీలో సేవలందించారు. అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఐజీగా పనిచేస్తూ అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. అక్కడినుంచి తెలంగాణ నిఘావిభాగం చీఫ్గా బదిలీ అయి ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) విభాగాన్నీ పర్యవేక్షిస్తున్నారు. హరియాణా రాష్ట్రం కర్నాల్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు ఆయుధాల చేరవేత కేసును చేధించినందుకుగాను గతేడాది ఆయన నేతృత్వంలోని సీఐసెల్కు స్పెషల్ ఆపరేషన్ మెడల్ దక్కింది.
1991లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగం(ఏపీఎస్పీ)లో చేరిన రామకృష్ణ ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో ఆర్ఎస్సై, ఆర్ఐగా పనిచేశారు. ఈ క్రమంలో 1998లో అప్పటి ముఖ్యమంత్రి భద్రత విభాగంలో పనిచేశారు. అనంతరం 2003 వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. 2003 నుంచి గ్రేహౌండ్స్లో విధులు నిర్వర్తించారు. ఇందుకు గుర్తింపుగా 2009లో ఏపీ పోలీస్ సేవాపతకం, 2019లో ఉత్తమ సేవాపతకం, 2014లో ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు శిక్షణ సంస్థల్లోనూ శిక్షకుడిగా వ్యవహరించారు. ఐపీఎస్లతోపాటు గ్రేహౌండ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నల్గొండలోని టీఎస్ఎస్పీ 12వ పటాలం అదనపు కమాండెంట్గా పనిచేస్తున్నారు.
ఉత్తమ సేవాపథకాలు పొందినవారు..
1. తరుణ్ జోషి, ఐజీ, శిక్షణ
2. విశ్వప్రసాద్, జాయింట్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్, హైదరాబాద్ కమిషనరేట్
3. గంగసాని శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్స్
4. పూనాటి నరసింహారావు, డీఎస్పీ, నిఘా విభాగం
5. రామపోగు అరుణ్రాజ్ కుమార్, డీఎస్పీ, హైదరాబాద్
6. గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ, కరీంనగర్
7. మామిల శ్రీధర్రెడ్డి, సీఐ, ఐటీ సెల్, హైదరాబాద్
8. నారాయణ స్వామి జైశంకర్, ఏఆర్ఎస్సై, మూడో బెటాలియన్
9. కారుకొండ దయాశీల, ఆర్ఐ, వరంగల్
10. గంగుల అచ్యుత రెడ్డి, అసిస్టెంట్ అస్సాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్
11. నడింపల్లి రామ్దేవ్రెడ్డి, సీఐ, నిఘా విభాగం, హైదరాబాద్
12. ఇజారి వీర రామాంజనేయులు, ఏఆర్ఎస్సై, సీఐ సెల్, హైదరాబాద్
13. బోండ వెంకట సన్యాసీరావు, సీఐ, టీఎస్పీఎఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్