రాష్ట్ర వృద్ధిరేటు భళా..
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్- జీఎస్డీపీ) విలువ 2021-22లో రూ.11,48,115 కోట్లకు చేరింది.
19.4 శాతం నమోదు... రూ.11.48 లక్షల కోట్లకు చేరిన జీఎస్డీపీ
దేశంలో మూడో స్థానం
నివేదిక విడుదల చేసిన డీఈఎస్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్- జీఎస్డీపీ) విలువ 2021-22లో రూ.11,48,115 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 19.4 శాతం అదనంగా పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిరేటు పెరుగుదలలో ఒడిశా, మధ్యప్రదేశ్ల తరువాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర అర్థ, గణాంక శాఖ(డీఈఎస్) రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక-అట్లాస్’లో వెల్లడించింది. ఈ నివేదికను బుధవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ రంగాల వృద్ధికి సంబంధించిన గణాంకాలను డీఈఎస్ వివరించింది. పలు రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలిపింది. 2012-13 నాటి నుంచి పోలిస్తే రాష్ట్రంలో 2021-22లో అత్యధికంగా 19.4 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు అత్యధిక వృద్ధిరేటు 2018-19లో 14.3 శాతంగా ఉంది. జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతం.
* 2020-21తో పోలిస్తే 2021-22లో జీఎస్డీపీ వృద్ధి రేటు అత్యధికంగా ఒడిశాలో 20.55, మధ్యప్రదేశ్లో 19.74, తెలంగాణలో 19.4 శాతం, ఏపీలో 18.47 శాతంగా ఉన్నాయి.
* ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి వార్షిక ఆదాయం రూ.2,75,443. జాతీయ సగటు రూ.1,50,007.
నల్గొండలో రైతుల మరణాలు అధికం
* 2018-22 మార్చి వరకు రాష్ట్రంలో 88,620 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.4,431 కోట్లను జీవిత బీమా పరిహారంగా ఇచ్చింది. మృతుల్లో 49-59 ఏళ్ల మధ్య వయసువారు 40,214 మంది ఉన్నారు.
* నాలుగేళ్ల కాలంలో రైతుల మరణాలు అత్యధికంగా నల్గొండ(5,673), సంగారెడ్డి (5,489), కామారెడ్డి(4,596), మెదక్ (4,160), నిజామాబాద్ (3,968) జిల్లాల్లో సంభవించాయి.
21 మంది విద్యార్థులకు ఒక టీచర్
* రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు 41,369 ఉండగా.. వీటిలో 62,28,665 మంది చదువుకుంటున్నారు. ఒక పాఠశాలకు సగటు విద్యార్థులు 151 మంది కాగా 21 మందికి ఒక టీచర్ ఉన్నారు.
ప్రగతికి తార్కాణం: వినోద్కుమార్
రాష్ట్రం సాధిస్తున్న పురోభివృద్ధికి గణాంకాలే తార్కాణమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. డీఈఎస్ నివేదికను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక పురోగతి, జీఎస్డీపీ వృద్ధిరేటు, అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలను ఈ నివేదికలో సవివరంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు డాక్టర్ జి.ఆర్.రెడ్డి, సంచాలకుడు జి.దయానందం, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, టీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ, కన్సల్టెంట్ రామభద్రం తదితరులు పాల్గొన్నారు.
66.7 విస్తీర్ణంలో పంటలు
రాష్ట్ర భూభాగంలో 66.7 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. 2019-20లో మొత్తం కోటీ 84 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని డీఈఎస్ వివరించింది.
* పత్తి సాగు విస్తీర్ణంలో 2020-21లో 23.58 లక్షల హెక్టార్లతో మహారాష్ట్ర తరువాత రెండో స్థానంలో ఉన్న తెలంగాణ పంట ఉత్పాదకతలో మాత్రం 10వ స్థానంలో నిలిచింది.హెక్టారుకు సరాసరి 418 కిలోల దూది మాత్రమే ఉత్పత్తి అయింది. దీనికి పూర్తి విరుద్ధంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణంలో 15వ స్థానంలో ఉంటే ఉత్పాదకతలో హెక్టారుకు 4,646 కిలోలతో రెండోస్థానంలో నిలిచింది. తమిళనాడు 7,276 కిలోలతో ముందుంది.
* 2020-21లో వరి సాగు విస్తీర్ణం, ఉత్పాదకతలోనూ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. చండీగఢ్లో అత్యధికంగా హెక్టారుకు 5,500 కిలోల బియ్యం దిగుబడి రాగా... 3,206 కిలోలతో తెలంగాణ 5వ స్థానానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!