భారాస ప్రభుత్వ ఉల్లంఘనలతో విసిగిపోయా
కొందరికి ఫామ్హౌస్లు ఉండడం కాదు.. అందరికీ ఫామ్లు(పొలాలు) ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులున్నాయి.
గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం తగ్గించారు
అంబేడ్కర్ చూపిన మార్గానికి ఇది వ్యతిరేకం
కరోనా ఉందన్నారు.. 5 లక్షల మందితో సభ పెట్టలేదా?
తెలంగాణ ప్రజల కోసం ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతా
కొందరికి ఫామ్హౌస్లు కాదు..అందరికీ పొలాలుండాలి
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై
యువత ధైర్యంగా పోరాడాలని పిలుపు
కొందరికి ఫామ్హౌస్లు ఉండడం కాదు.. అందరికీ ఫామ్లు(పొలాలు) ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులున్నాయి.
తమిళిసై
ఈనాడు- హైదరాబాద్, పుదుచ్చేరి: తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని తక్కువ చేసిందని, ఈ సందర్భంగా అధికారిక కార్యక్రమం ఏదీ నిర్వహించలేదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే కొత్తగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కాదు... పేదలందరికీ ఇళ్లు కావాలన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, పుదుచ్చేరిలోని ‘రాజ్నివాస్’లో నిర్వహించిన ‘ఎట్హోం’లో ఆమె మాట్లాడారు. ‘‘భారాస ప్రభుత్వం సంప్రదాయాలను ఉల్లంఘిస్తోంది.. విసుగెత్తిపోయా. ఇది రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన మార్గానికి వ్యతిరేకం. నేను కొందరికి నచ్చకపోవచ్చు. తెలంగాణ ప్రజలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడివారి కోసం ఎంత కష్టమైనా భరించి పనిచేస్తా. ఎవరైనా నా మీద ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతా. తెలంగాణలో గణతంత్ర దినోత్సవాల కోసం రాష్ట్ర పౌరులు హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు సైతం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాశా. ప్రతినెలా ఇలా కేంద్రానికి నివేదికలు పంపుతా. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి ఉండాల్సింది. కార్యక్రమం నిర్వహించకపోవడానికి కరోనా ఉందని వంక చెప్పింది. కానీ, ఇటీవలే దాదాపు అయిదు లక్షల మందికి పైగా ప్రజలతో ఓ కార్యక్రమాన్ని వాళ్లు నిర్వహించుకోలేదా?
రోజుకు 22 మంది ఆత్మహత్యలు
రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యలపై యువత ధైర్యంగా నిలబడి పోరాడాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఎన్నో రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తోంది. వైద్యం, ఐటీ రంగాల్లో రాజధాని ప్రత్యేక గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని వందేభారత్ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్భవన్ అందిస్తోంది. గిరిజనుల్లో పోషకాహార సమస్యను నివారించడానికి విశేషంగా కృషిచేస్తున్నాం. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ప్రజాస్వామ్య హక్కును నిలబెట్టుకుందాం. రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర ఎప్పుడూ ఉంటుంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాశరధి కృష్ణమాచార్య రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ గేయాన్ని చదివారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, అనంతరం ఆంగ్లంలో కొనసాగించారు.
విశిష్ట సేవలకు సత్కారం
విశిష్ట సేవలందించిన పలువురిని రాజ్భవన్లో గవర్నర్ సత్కరించారు. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి ట్రస్టు సభ్యులు, క్రీడా విభాగంలో శ్రీజ ఆకుల(టేబుల్ టెన్నిస్) తరఫున ఆమె తల్లిదండ్రులు, పారా అథ్లెటిక్స్ విభాగంలో కుడుముల లోకేశ్వరి, విద్య, యువత ఉపాధి విభాగంలో ఎం.బాలలతను సర్టిఫికెట్, శాలువా, మెమొంటోలతో గవర్నర్ సత్కరించారు. రాజ్భవన్లో జాతీయజెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం పుదుచ్చేరి వెళ్లారు. అంతకుముందు పరేడ్ మైదానంలోని సైనికవీరుల స్మారకానికి గవర్నర్ నివాళులు అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి