హామీల అమలే లక్ష్యం!
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్ద పీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలకు కేటాయింపులు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లక్ష్యంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.
సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు
ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్పై తుది కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్ద పీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలకు కేటాయింపులు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లక్ష్యంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. తెరాస(భారాస) ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ఇందులో మొదటి ఏడాది రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేయగా తర్వాత క్రమంగా పెంచుకుంటూ రూ.37 వేల లోపు అప్పులను రద్దు చేశారు. తర్వాత రుణమాఫీ ఆగిపోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు రుణమాఫీకి నిధులు కేటాయించారు. ఆ ఏడాది రూ.5,225 కోట్లను కేటాయించినా వ్యయంచేయలేదు. 2022-23లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అమలుకు వీలుగా బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.
* 2022-23లో దళితబంధుకు రూ.17 వేల కోట్లను కేటాయించగా ఈ సారి కూడా అంతే మొత్తంలో నిధులివ్వనున్నట్లు తెలిసింది. రైతుబంధుకు రూ.15 వేలకోట్ల మేర కేటాయింపులు ఉండనున్నాయి. రైతుబీమాకు కేటాయింపులను వాస్తవిక ప్రాతిపదికగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. రెండు పడకల గదుల ఇళ్లకు 2022-23లో రూ.12 వేలకోట్లు కేటాయించగా ఈ సారీ యథాతథంగా నిధులివ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్ కిట్కు రూ.500 కోట్లకు పైగా కేటాయించనున్నారు.
* కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం తొలిసారిగా బడ్జెట్ కేటాయింపులు 3 వేల కోట్ల మేరకు చేరనున్నట్లు తెలిసింది. ఈఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లుండగా వచ్చే ఏడాది నిధులు పెరగనున్నాయి.
* 57 ఏళ్లకే ఆసరా పింఛను అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేటాయింపులు రూ.12 వేలకోట్లు దాటనున్నాయి. వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్లో నిధులు తగ్గకూడదనే ప్రాథమిక సూత్రం ప్రాతిపదికగా బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తున్నారు.
నియోజకవర్గానికి వేయి మంది... రూ.1000 కోట్లు
సొంత జాగా గల వారికి ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల సాయం పథకానికి బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి వేయి మందికి చొప్పున సాయం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయి. కొత్త బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగా పథకాన్ని ప్రారంభించే వీలుంది. ఈ పథకం కోసం నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ వారిని ఎంపిక చేస్తుందని తెలిసింది.
* వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద పీటవేయనున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు రూ.35 వేలకోట్లకు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దళితబంధు నేపథ్యంలో ఎస్సీ సంక్షేమానికి 2022-23 బడ్జెట్లో రూ.20,624 కోట్లు కేటాయించగా ఈ సారి నిధులు పెరగనున్నాయి. రెండు మూడ్రోజుల్లో బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చేలా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. వేతన సవరణ ఒప్పందం అమలుతో పాటు కొత్త ఉద్యోగ నియామకాల నేపథ్యంలో వేతనాలు, పింఛన్లకు కేటాయింపులు భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని ప్రకటనలను రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు ముందే పూర్తి చేసేలా దృష్టిసారించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్