Adani Stocks: ‘షేక్’ మార్కెట్.. సూచీలకు అదానీ షాక్
నిన్న మొన్నటివరకు మదుపర్లకు లాభాల పంట పండించిన అదానీ షేర్లు... ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తున్నాయి.
5-20శాతం పతనమైన ఆ గ్రూప్ కంపెనీల షేర్లు
ఆ ప్రభావంతో మూడు నెలల కనిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ
రెండు రోజుల్లో రూ.10.73 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: నిన్న మొన్నటివరకు మదుపర్లకు లాభాల పంట పండించిన అదానీ షేర్లు... ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తున్నాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్లో అమ్మకాలు పోటెత్తాయి. బుధవారం 3-8% వరకు క్షీణించిన ఈ షేర్లు... శుక్రవారం మరో 5-20% వరకు పతనమయ్యాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని అదానీ గ్రూపు వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.10.73 లక్షల కోట్లు కోల్పోయి రూ.269.65 లక్షల కోట్లకు పరిమితమైంది. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్లు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకింగ్, ఫైనాన్స్, యుటిలిటీస్, చమురు షేర్లు కుదేలవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.
విదేశీ మదుపర్ల విక్రయాలు
సాధారణ బడ్జెట్కు ముందు విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 81.53 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.35 శాతం లాభపడి 88.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం... నిన్న ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) పైనా పడింది. తొలిరోజు మదుపర్ల నుంచి పేలవ స్పందనే లభించింది. సెన్సెక్స్ ఉదయం 60,166.90 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయిన సూచీ.. ఇంట్రాడేలో 58,974.70 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 874.16 పాయింట్ల నష్టంతో 59,330.90 వద్ద ముగిసింది. అక్టోబరు 21 తర్వాత సెన్సెక్స్కు ఇదే కనిష్ఠ స్థాయి. ఇక నిఫ్టీ కూడా 287.60 పాయింట్లు కుదేలై 17,604.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,493.55 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.
వీటికి లాభాలు...
రెండేళ్లలో తొలిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదుచేయడంతో టాటా మోటార్స్ షేరు దుమ్మురేపింది. ఇంట్రాడేలో 8.16% పరుగులు తీసిన షేరు రూ.453.20 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 6.34% లాభంతో రూ.445.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,819.46 కోట్లు పెరిగి రూ.1,47,981.46 కోట్లకు చేరింది. ఐటీసీ 1.77%, ఎం అండ్ ఎం 0.71%, సన్ఫార్మా 0.35% లాభపడ్డాయి. ఎఫ్ఎమ్సీజీ, ఆరోగ్య సంరక్షణ, వాహన రాణించాయి. బీఎస్ఈలో 2783 షేర్లు నష్టాల్లో ముగియగా, 784 స్క్రిప్లు లాభపడ్డాయి. 91 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
సెన్సెక్స్ 30 షేర్లలో 23 నష్టాల్లోనే...
సెన్సెక్స్ 30 షేర్లలో 23 కుప్పకూలాయి. ఎస్బీఐ(5.03%), ఐసీఐసీఐ బ్యాంక్(4.41%), ఇండస్ఇండ్ బ్యాంక్(3.43%), యాక్సిస్ బ్యాంక్(2.07%), కోటక్ బ్యాంక్(2.03%), టెక్ మహీంద్రా(1.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1.96%), రిలయన్స్(1.90%), హెచ్డీఎఫ్సీ(1.87%), ఏషియన్ పెయింట్స్(1.71%), ఇన్ఫోసిస్(1.60%), టైటన్(1.05%) చొప్పున నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్ 7.34%, విద్యుత్ 6.79%, చమురు-గ్యాస్ 5.75%, ఇంధన 5.22%, టెలికాం 3.79%, కమొడిటీస్ 3.27%, బ్యాంకింగ్ 3.06%, ఆర్థిక సేవలు 2.48% క్షీణించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం