కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలి
బీసీల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
ప్రధానికి లేఖ పంపిన జాజుల శ్రీనివాస్గౌడ్
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: బీసీల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీకి మెయిల్ ద్వారా లేఖ పంపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.39 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో రూ.2 వేల 15 కోట్లను బీసీలకు కేటాయించి రూ.70 కోట్లనే ఖర్చు చేసిందన్నారు. బీసీల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని మోదీ.. బీసీలకు నిధుల కేటాయింపులో ఈసారి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం