బండి సంజయ్‌ కుమారుడికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడికి దుండిగల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Published : 28 Jan 2023 05:05 IST

దుండిగల్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడికి దుండిగల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితమే ఈ నోటీసులు జారీ చేసినా పోలీసులు గోప్యంగా ఉంచారు. హైదరాబాద్‌లోని ఓ వర్సిటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సంజయ్‌ కుమారుడు అసభ్య పదజాలంతో తోటి విద్యార్థిని దూషిస్తూ దాడికి పాల్పడిన వీడియో జనవరి 17న సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై వర్సిటీ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌ సుఖేష్‌ ఫిర్యాదు మేరకు అదే రోజు దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ నెల 18న ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను సీఐ రమణారెడ్డిని అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న పోలీసుల ఎదుట హాజరవగా.. ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని పేర్కొంటూ అతడికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని