ఇరుకు మార్గాల్లో ఇంకెన్నాళ్లు?
దక్షిణ మధ్య జోన్ నుంచి రైల్వేశాఖకు గతేడాది రూ.14,266 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) డిసెంబరు ఆఖరు నాటికే రూ.13,787 కోట్లు వచ్చింది.
దేశ రైల్వే నెట్వర్క్లో తెలంగాణలో 3 శాతం లోపే
రాష్ట్రంలో 57 శాతానికిపైగా సింగిల్ లైన్లే
ఆశలన్నీ బడ్జెట్ కేటాయింపులపైనే
ఈనాడు, హైదరాబాద్: దక్షిణ మధ్య జోన్ నుంచి రైల్వేశాఖకు గతేడాది రూ.14,266 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) డిసెంబరు ఆఖరు నాటికే రూ.13,787 కోట్లు వచ్చింది. మరో మూడు నెలల సమయం ఉండటంతో గతేడాది కంటే కనీసం రూ.4 వేల కోట్లకు పైగా ఎక్కువ లభించే అవకాశాలున్నాయి. జోన్లో అటు ప్రయాణికులు, ఇటు సరకుల రవాణాతో భారీగా ఆదాయం వచ్చే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మాత్రం అత్తెసరు ప్రాధాన్యం కూడా లభించట్లేదు. రాష్ట్రానికి గతేడాది కేవలం రూ.3 వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. దేశ రైల్వే నెట్వర్క్లో రాష్ట్ర వాటా 3 శాతం కూడా లేదు. అందులోనూ సింగిల్ లైన్లే 57 శాతానికి పైగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం నుంచి కొత్త రైళ్లు పట్టాలు ఎక్కించడంలో, ఉన్నవాటిని వేగంగా నడిపించడంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి.
ఎంపీలతో సమావేశమే లేదు..
ఏటా కేంద్ర బడ్జెట్కు ముందే రాష్ట్రంలోని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం ఏర్పాటు చేసి.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. తమ ప్రాంతాలకు అవసరమైన కొత్త రైల్వే లైన్లు, ప్రస్తుతం ఉన్న మార్గాల విస్తరణ, నూతన రైళ్లు, స్టాపేజీలు వంటి అనేక ప్రతిపాదనలను వారు ఇస్తారు. ప్రజల అవసరాలు, డిమాండ్లను వినిపిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయినా.. ఈసారి సమావేశమే పెట్టలేదు. జోన్ నుంచి రైల్వే బోర్డుకు ఏం ప్రతిపాదనలు పంపారన్న విషయంపై మాట్లాడేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయట్లేదు.
సింహభాగం సింగిలే
రైళ్లు అతి వేగంతో పరుగులు పెట్టాలన్నా, ఎక్కువ సంఖ్యలో నడిపించాలన్నా ట్రాకే కీలకం. ఓ వైపు ప్రయాణికులు, మరోవైపు సరకు రవాణా రైళ్లు నడుస్తుంటాయి. మూడు లైన్ల మార్గం ఉంటే రైళ్లను పరుగులు పెట్టించొచ్చు. రెండు లైన్ల మార్గం ఉంటే పర్వాలేదు. సింగిల్ లైన్ ఉంటే.. ఒక రైలు వెళ్తోంటే మరోటి ఆపాలి. తెలంగాణలో ఇలాంటి సింగిల్ లైన్లే ఎక్కువగా ఉన్నాయి.
నెట్వర్క్కు నోచుకోని ప్రాంతాలెన్నో..
దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల అభివృద్ధిలో రవాణా రంగానిది కీలక పాత్ర. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారిని ఉపాధి, ఉద్యోగ, వ్యాపార, పర్యాటకంగా ఆకర్షించే నగరాలు, పట్టణాలు, ప్రాంతాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఉత్తరాది నుంచే లక్షల మంది కార్మికులు నగరానికి వస్తుంటారు. వ్యాపార వర్గాలవారు, ఐటీ ఉద్యోగులూ లక్షల్లో ఉన్నారు. వైద్యం కోసమూ పెద్దసంఖ్యలో హైదరాబాద్కు వస్తుంటారు. యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, పర్యాటక గ్రామం పోచంపల్లి, సుందర జలపాతం బొగత, పెద్దపులులు, ఇతర క్రూరమృగాలు, నల్లమల అందాలు, కృష్ణమ్మ పరుగులతో పర్యాటకుల్ని ఆకర్షించే అమ్రాబాద్ టైగర్ రిజర్వు, అతిపెద్ద గిరిజన జాతర సమక్క-సారలమ్మ, ప్రపంచ బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించే నాగార్జునసాగర్లోని బుద్ధవనం, సూర్యాపేట జిల్లా ఫణిగిరి.. ఇలా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఇప్పటికీ రైల్వే నెట్వర్క్ లేదు.
సూర్యాపేట మీదుగా లైన్ ఊసేదీ?
కొత్త మార్గాలు, ఉన్నవాటి విస్తరణపై అనేక డిమాండ్లు ఉన్నాయి. సూర్యాపేట మీదుగా హైదరాబాద్-విజయవాడ రైల్వే లైన్ డిమాండ్ దశాబ్దకాలంగా గట్టిగా వినిపిస్తోంది. ఎంపీలు ఏటా అడుగుతున్నా రైల్వేశాఖ స్పందించట్లేదు. దీన్ని మంజూరు చేస్తే కనీసం 60 కి.మీ. దూరం తగ్గుతుంది. సికింద్రాబాద్-శ్రీశైలం రోడ్డు సర్వే పూర్తయినా ఆర్థికంగా గిట్టుబాటు కాదని రైల్వేశాఖ పక్కన పెట్టింది. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు పర్యాటకానికి, వెనుకబడిన నాగర్కర్నూల్ జిల్లా అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టు ఇది.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయలోపం
కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఉన్నవాటిని వేగంగా పూర్తి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. యాదాద్రి ఎంఎంటీఎస్, మనోహరాబాద్-కొత్తపల్లి, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ వంటి ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి.
నిధులు భారీగా ఇస్తేనే..
* సికింద్రాబాద్ స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. అంచనా వ్యయం రూ.699 కోట్లు. నిర్మాణ సమయం 36 నెలలు. ఈ బడ్జెట్లో కనీసం రూ.300 కోట్లయినా మంజూరు చేస్తేనే అనుకున్న సమయంలో పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది.
* కాజీపేట పీరియాడికల్ ఓవర్హాలింగ్(పీఓహెచ్) వర్క్షాప్ ప్రాజెక్టు దాదాపు అయిదేళ్లు ఆలస్యమైంది. దీంతో అంచనా వ్యయం దాదాపు రూ.వంద కోట్లు పెరిగింది. గత నెలలో గుత్తేదారును ఎంపిక చేశారు. అంచనా వ్యయం రూ.361.79 కోట్లు. కనీసం రూ.200 కోట్లు కేటాయిస్తే తప్ప ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తికాదు.
* హైదరాబాద్ నుంచి కరీంనగర్ను అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి ఈసారి భారీ కేటాయింపులు అవసరం.
* ఘట్కేసర్-రాయగిరి ఎంఎంటీఎస్ విస్తరణ ప్రాజెక్టుకు నాలుగైదేళ్లుగా నిధుల్లేవు. ఈసారైనా కేటాయిస్తే యాదాద్రి భక్తులకు చౌక ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. కాజీపేట వరకు మూడో లైను మంజూరు చేస్తే.. హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, ఏపీ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల వైపు రాకపోకలు సులభమవుతాయి.
* దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్, ముంబయి, బెంగళూరు కీలకమైనవి. కానీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, ముంబయికి చాలా దూరం సింగిల్ లైన్లలోనే ఆగుతూ..సాగుతూ రైళ్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో డబుల్ లైన్లుగా మార్చాలి.
* బీబీనగర్ నుంచి నల్గొండ, మిర్యాలగూడెం, ఏపీలోని నల్లపాడు వరకు సింగిల్ లైనే ఉంది. డబుల్ లైన్పై సర్వే పూర్తయి ఏడాది దాటింది. ఇప్పటికైనా మంజూరు చేయాలి.
* కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్, ఘన్పూర్-సూర్యాపేట వయా పాలకుర్తి, ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్, పటాన్చెరు-సంగారెడ్డి-మెదక్ వంటి ప్రతిపాదిత లైన్లను మంజూరు చేయాలి. రామగుండం-మణుగూరు కొత్త లైనుకు రైల్వే బోర్డు సూత్రప్రాయ ఆమోదం లభించింది. బడ్జెట్లో ప్రకటిస్తే దీర్ఘకాల డిమాండ్కు మోక్షం లభిస్తుంది. మోటుమర్రి-విష్ణుపురం సింగిల్ లైన్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లను అనుమతిస్తున్నారు. దీన్ని డబ్లింగ్ చేస్తే ప్రయాణికుల రైళ్లను పట్టాలు ఎక్కించడానికి వీలవుతుంది. హైదరాబాద్-విజయవాడ మార్గాల్ని అనుసంధానించే లైనవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు