స్టార్టప్లతోనే సవాళ్లకు కొత్త పరిష్కారాలు
ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు కొత్త మార్గాన్ని సూచిస్తాయని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
అంతర్జాతీయ వ్యవస్థకు కృషిచేయాలి
స్టార్టప్-20 సమావేశాల్లో కేంద్ర మంత్రి పీయూష్
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు కొత్త మార్గాన్ని సూచిస్తాయని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతర్జాతీయ స్టార్టప్ వ్యవస్థను మెంటార్స్, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు బలోపేతం చేయాలని పేర్కొన్నారు. భారత్ నేతృత్వంలో జరగనున్న జీ20 సమావేశాల్లో భాగంగా కొత్తగా ఏర్పాటైన స్టార్టప్-20 గ్రూపు రెండు రోజుల ఆరంభ సమావేశాలు హైదరాబాద్లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పీయూష్గోయల్ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. సొంతంగా స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమీకృత, సహకార, సుస్థిర స్టార్టప్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉందన్నారు. స్టార్టప్-20 గ్రూపు ఆరంభ సమావేశాలు బలమైన, వేగవంతమైన చర్యలు తీసుకునేలా జీ20 దేశాలకు సూచనలు చేయాలని, అంతర్జాతీయ స్టార్టప్ల విప్లవానికి నాంది పలకాలని సూచించారు. ‘‘అమృతోత్సవాల వేళ భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడంలో నూతన ఆవిష్కరణలు ప్రధాన భూమికను పోషిస్తాయి.వీటి సహాయంతో టైర్-2, 3 నగరాల్లో స్టార్టప్ల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువధరలతో పొరుగుసేవలు అందించే స్థాయి నుంచి అంతర్జాతీయ టెక్నాలజీ, ఇన్నొవేషన్ హబ్లుగా మారాలి’’ అని సూచించారు.
ఉద్యోగాలు కల్పించేలా యువత ముందడుగు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
దేశంలో యువత ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి స్టార్టప్ల ద్వారా ముందడుగు వేస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రపంచ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, వచ్చే 25 ఏళ్లలో స్టార్టప్ కంపెనీలు దేశ జీడీపీలో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు.
90 లక్షల మందికి ఉద్యోగాలు: కేంద్రమంత్రి సోంప్రకాశ్
దేశంలో స్టార్టప్ల ద్వారా 90 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాశ్ తెలిపారు. స్టార్టప్లు ఆర్థికాభివృద్ధిలో కీలకమని, ప్రస్తుతం 88వేల స్టార్టప్లతో ప్రపంచంలో మనదేశం మూడోస్థానంలో ఉందన్నారు. 47శాతం స్టార్టప్లలో మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారని, వచ్చే 25 ఏళ్లలో సమీకృత సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల నాణ్యమైన జీవనానికి, ఆర్థిక వృద్ధికి స్టార్టప్లు తోడ్పాటు అందిస్తాయన్నారు. స్టార్టప్-20 ‘ఫౌండేషన్, అలయన్స్’ థీమ్ సమావేశాలు సిక్కింలో, ఫైనాన్స్ థీమ్ సమావేశాలు అండమాన్లో, సమీకృత, సుస్థిరత సమావేశం బెంగళూరులో జరుగుతాయని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్కాంత్ తెలిపారు. స్టార్టప్-20 ముగింపు సమావేశాలు గుడ్గావ్లో ఉంటాయని, ఈ సమావేశాల్లో కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు స్టార్టప్ల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశంలో ఐఐటీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు విదేశీ కంపెనీల్లో మెరుగైన ఉద్యోగాల కోసం ఎదురుచూడటం లేదని, సొంతంగా స్టార్టప్లతో ఉద్యోగాలిచ్చేలా మారుతున్నారని నీతిఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు. దేశంలో ప్రతిరోజూ సగటున 60-70 స్టార్టప్లు ప్రారంభమవుతున్నాయని, వీటిని ప్రోత్సహించేందుకు నీతిఆయోగ్ సహకారం అందిస్తోందన్నారు. స్టార్టప్లలో తెలంగాణ ముందుందని, స్టార్టప్ సమావేశాల్లో 6, 7 అంశాలతో కూడిన కార్యాచరణపై చర్చలు నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణలో తొలిసారిగా..
దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ల కోసం ఇన్నొవేషన్ విధానాన్ని ప్రకటించిందని తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. స్టార్టప్లను ప్రోత్సహిచేందుకు కీలకంగా కృషిచేస్తోందని, టీ-హబ్, టీ-వర్క్స్, వీహబ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్టార్టప్-20 అధ్యక్షుడు చింతన్ వైష్ణవ్, కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, సంయుక్త కార్యదర్శి శృతి, జీ-20 దేశాల స్టార్టప్, పరిశ్రమలు, సీడ్ఫండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్