రూ.3,359 కోట్ల కోసం ఎదురుచూపులు
రైతు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధులు భారీగా పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది.
సేద్యానికి 2022-23 బడ్జెట్ కేటాయింపులు రూ.22,139 కోట్లు
విడుదలైంది రూ.18,780 కోట్లు
ఇంకా రెండు నెలలే గడువు
వచ్చే బడ్జెట్ ప్రతిపాదనలు రూ.24,467 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: రైతు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధులు భారీగా పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ప్రస్తుత ఏడాది(2022-23) బడ్జెట్లో రూ.22,139.71 కోట్లు కేటాయించగా రూ.18,780 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.3,359 కోట్లు విడుదల కావాల్సి ఉంది. వచ్చే మార్చి 31లోగా వీటిని విడుదల చేస్తేనే వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ యంత్రాలు, రైతువేదికలు, మార్కెట్ జోక్యం నిధి తదితర రాష్ట్ర పథకాలకు ఇంకా కొన్ని నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్) కింద ప్రస్తుత ఏడాదికి రూ.528.17 కోట్లు కేటాయించగా వీటిలో సగానికి పైగా విడుదల కాలేదు. రాష్ట్ర వాటా 40 శాతం నిధులను విడుదల చేస్తేనే తాము ఇచ్చే 60 శాతం ఇస్తామని కేంద్రం షరతులు పెట్టడంతో ఈ పథకాలు రైతులకు అందడం లేదు. ఉదాహరణకు భూసార పరీక్షలు చేసి రైతులకు వాటి ఫలితాల కార్డులను ఇచ్చేందుకు ‘నేషనల్ ప్రాజెక్టు ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ’ అనే పేరుతో అమలుచేస్తున్న కార్యక్రమానికి ఈ ఏడాది రూ.71.65 కోట్లను సీఎస్ఎస్ కింద కేటాయించారు. వీటిలో 40 శాతం రాష్ట్రం, 60 శాతం కేంద్రం విడుదల చేయాలి. ఈ నిధులు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’(ఆర్కేవీవై) పేరుతో కేంద్రం అమలుచేసే పథకం కింద వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధకం, విశ్వవిద్యాలయాలు తదితర వ్యవసాయ అనుబంధ విభాగాలన్నింటికీ కలిపి ఈ ఏడాది రూ.334.52 కోట్లు సీఎస్ఎస్ పద్దు కింద కేటాయించారు. ఈ నిధులూ పూర్తిగా విడుదల కాలేదు. వచ్చే ఏడాది(2023-24)లో కూడా ఇంతే మొత్తంలో రూ.334.52 కోట్లను ఆర్కేవీవై పథకం కింద కేటాయించాలని తాజాగా ప్రతిపాదనలు పంపారు.
వచ్చే ఏడాదికి భారీగా పెంచాలి
త్వరలో రాష్ట్ర బడ్జెట్లో రూ.24,467.11 కోట్లను కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గతేడాదికన్నా రూ.2,328 కోట్లు పెంచాలని ప్రతిపాదనల్లో కోరారు. రైతుబంధు పథకానికి రూ.15,075 కోట్లు, పంటరుణమాఫీకి రూ.6,389 కోట్లు, రైతుబీమాకి రూ.1,589 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.500 కోట్లు, పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనే మార్కెట్ జోక్యం పథకానికి రూ.100 కోట్లు, పంటలబీమా పథకానికి రూ.196 కోట్లు కావాలని కోరారు. ఇవి కాక పలు చిన్నచిన్న కార్యక్రమాలకు మరికొన్ని నిధులు అడిగారు. మరోపక్క గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2018 డిసెంబరు 11 వరకూ రూ.లక్ష లోపు బాకీ ఉన్న రైతులందరి పంటరుణాలను మాఫీ చేస్తామని నాడు తెరాస(భారాస) హామీ ఇచ్చింది. ఈ పథకం కింద ఇంకా దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్లో ఆ మేరకు కేటాయించి పంటరుణాలన్నీ మాఫీ చేస్తారా? అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు