రాష్ట్రంలో 1.35 కోట్ల ఎకరాలకు సాగునీరు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరాకృతి, రీ ఇంజినీరింగ్‌తో అనేక ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని రాష్ట్ర గణాంక నివేదిక- 2022 పేర్కొంది.

Updated : 29 Jan 2023 04:21 IST

తెలంగాణ గణాంక నివేదిక- 2022లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరాకృతి, రీ ఇంజినీరింగ్‌తో అనేక ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని రాష్ట్ర గణాంక నివేదిక- 2022 పేర్కొంది. నివేదికలోని అంశాలను శనివారం సమాచారశాఖ విడుదల చేసింది. ‘2014లో రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం 62.48 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా 2022 నాటికి ఒక కోటి 35 లక్షల 60 వేల ఎకరాలకు పెరిగింది. 24 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో 69.02 లక్షల ఎకరాల ఆయకట్టు కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆ ప్రాజెక్టుల కింద కొత్తగా 19.48 లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం పెరిగింది. మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటిసరఫరా పెరిగింది. పెరిగిన సాగునీటి విస్తరణ కారణంగా 2014లో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి ఉండగా 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. దీంతో దేశంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. దేశ నీటిపారుదల చరిత్రలో తెలంగాణ సాగునీటి రంగం సరికొత్త అధ్యాయంగా నిలుస్తోంది’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని