సర్కారు వైద్యంపై పేదలకు పెరిగిన నమ్మకం
‘అన్ని వయసుల వారికి ఆరోగ్యం.. అన్ని దశల్లో ఆరోగ్యం’ నినాదంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
రాష్ట్రంలో అయిదంచెల వైద్య వ్యవస్థ
మంత్రి హరీశ్రావు వెల్లడి
వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక-2022 విడుదల
ఈనాడు, హైదరాబాద్: ‘అన్ని వయసుల వారికి ఆరోగ్యం.. అన్ని దశల్లో ఆరోగ్యం’ నినాదంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపై పేదలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. అత్యుత్తమ వైద్య సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ 2022 వార్షిక నివేదికను ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హరీశ్రావు విడుదల చేసి మాట్లాడారు. ‘‘వైద్యఆరోగ్య శాఖ తలసరి బడ్జెట్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శాఖకు రూ.11,440 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో గతంలో మూడంచెల వైద్య వ్యవస్థ ఉండగా.. ప్రస్తుతం పల్లె/బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీల రూపంలో అయిదంచెల్లో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. 2022లో ఒకేసారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభిస్తున్నాం. గత ఏడాది అదనంగా 200 పీజీ సీట్లు తెచ్చాం. కాన్పు సమయంలో తల్లుల మరణాల (ఎంఎంఆర్) జాతీయ సగటు 97 కాగా.. రాష్ట్రంలో 56 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాల (ఐఎంఆర్) జాతీయ సగటు 28 కాగా.. తెలంగాణలో 23 నుంచి 21కి తగ్గించాం.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్తగా 8,200 పడకల ఏర్పాటు పనులు ప్రారంభించాం. టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణాలకు బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోనున్నాం. వైద్య ఆరోగ్యశాఖలో గతేడాది 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 969 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ 5 నెలల్లోనే పూర్తయింది. 5,204 స్టాఫ్ నర్సుల నియామకం సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో ప్రొఫెసర్లుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తాం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఎలా ఉందో.. తెరాస ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేసిన ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్ 10వ స్థానంలో, రాజస్థాన్ 16వ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యం కోసం వచ్చేవారు 31 శాతం మంది ఉండగా నేడు 62 శాతానికి పెరిగారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమైన ఉత్తర్ ప్రదేశ్.. ప్రభుత్వ వైద్యంలో చిట్టచివరి స్థానంలో ఉందని కేంద్రమే చెప్పింది’’ అని మంత్రి వివరించారు.
2022లో వైద్య ఆరోగ్యశాఖలో పురోగతి ఇలా..
* గతంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 101కి పెరిగింది.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య 4.23 కోట్ల నుంచి 4.83 కోట్లకు, ఇన్పేషెంట్ సేవలు 14.16 లక్షల నుంచి 16.97 లక్షలకు పెరిగాయి. మేజర్, మైనర్ శస్త్రచికిత్సలు 2.57 లక్షల నుంచి 3.04 లక్షలకు పెరిగాయి.
* 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ విజయవంతమైంది.
* గతేడాది మొత్తం 5.40 లక్షల కాన్పులు జరగగా 3.27 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయి. ఆసుపత్రి ప్రసవాలు 97 శాతం నుంచి 99.99 శాతానికి పెరిగాయి.
* గర్భిణులకు 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
* బస్తీ దవాఖానాల సంఖ్య 334కు పెరగ్గా.. వీటిలో ఓపీ 34 లక్షల నుంచి 47 లక్షలకు పెరిగింది. 2,500 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం.
* నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమంలో 1.48 కోట్ల మందికి పరీక్షలు చేసి బీపీ, షుగర్ బాధితులకు కిట్లు ఇస్తున్నాం.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతేడాది 700 మందికి పైగా అవయవ మార్పిడి జరిగింది.
* ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు.
అవార్డులు.. గుర్తింపులు
ప్రభుత్వ వైద్యంలో నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మనం చేపడుతున్న అనేక వినూత్న విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్రమే తెలిపింది. సహజ ప్రసవానికి రూ.3,000 ప్రోత్సాహకం ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలు దీన్ని అనుసరించాలని కేంద్రం సూచించింది. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో మొదటి స్థానంలో, ఏడు పీజీ సీట్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచాం. మిడ్ వైఫరీ వ్యవస్థకు ‘టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్’ అవార్డు వచ్చింది. యూనిసెఫ్ సైతం ప్రశంసించింది. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, సంరక్షించడంలో రెండో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నాం. తెలంగాణ డయాగ్నోస్టిక్కు ఎన్ఏబీఎల్ గుర్తింపు, నేషనల్ హెల్త్ మిషన్ ప్రశంసలు, పల్లె దవాఖానాల ఏర్పాటుకు కేంద్రం నుంచి అవార్డు అందాయి.
హరీశ్రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM