సంక్షిప్త వార్తలు(12)
జేఎన్టీయూహెచ్లో 12 మంది ఆచార్యులకు సీనియర్ ఆచార్యులుగా సోమవారం పదోన్నతి ఉత్తర్వులిచ్చారు.
సీనియర్ ఆచార్యులుగా పదోన్నతులు
‘ఈనాడు’ వార్తకు స్పందన
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో 12 మంది ఆచార్యులకు సీనియర్ ఆచార్యులుగా సోమవారం పదోన్నతి ఉత్తర్వులిచ్చారు. ఈనెల 29న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘సీనియర్’ పదోన్నతుల్లో ఎందుకంత జాప్యం’? అనే శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న 12 మందికి పదోన్నతి ఇస్తూ రిజిస్ట్రార్ సోమవారం ఆర్డర్లు అందజేశారు.
ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తు గడువు 1 వరకు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 1 వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన గడువు సోమవారంతో ముగియగా.. గడువును పొడిగించాలని టీఎస్యూటీఎఫ్ తదితర సంఘాలు ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రెండు రోజులపాటు పొడిగిస్తూ విద్యాశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి అద్భుత అవకాశాలు: విజయ్గుప్తా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మత్స్యరంగానికి అద్భుత భవిష్యత్తు ఉందని అంతర్జాతీయ మత్స్యరంగ నిపుణుడు మోదుగు విజయ్ గుప్తా తెలిపారు. ఈ రంగం ద్వారా ఆదాయ వనరులు, ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలలో భాగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో నీటి వనరుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, దీంతో చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన విజయ్ గుప్తాను సోమవారం ఆయన నివాసంలో భారాస ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఇతర ప్రతినిధులు కలిసి సత్కరించారు.
అగ్నిపథ్కు ఎంపికైన గురుకుల విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: సైన్యంలో ప్రవేశానికి నిర్వహించిన అగ్నిపథ్ ఎంపికల్లో గిరిజన గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు చోటుదక్కించుకున్నారు. గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న మాలోత్ జావేందర్, భానోత్ రావు, వేల్పుల అజయ్, అశోక్ నగర్ గిరిజన సైనిక స్కూల్కు చెందిన ఇస్లావత్ నరేశ్లు ఇటీవల నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ చూపించి ఉద్యోగాలు పొందారు.
రికార్డ ధర పలికిన కొత్త దేశీ రకం మిర్చి
ఎనుమాముల మార్కెట్, న్యూస్టుడే: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొత్త దేశీ రకం మిర్చి సోమవారం రికార్డు ధర పలికింది. క్వింటాకు ఏకంగా రూ.81 వేలు లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన పల్లెపాటి విద్యాసాగర్ మార్కెట్కు తీసుకొచ్చిన మూడు బస్తాల దేశీరకం మిర్చిని సాగర్ ట్రేడర్స్ అడ్తీ ద్వారా భాగ్యలక్ష్మి ట్రేడర్స్ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ నెల 6న కొత్త దేశీ రకానికి క్వింటా రూ.80,100 లభించగా గతేడాది సెప్టెంబరు 29న శీతల గిడ్డంగుల్లోని దేశీ మిర్చి క్వింటాకు రూ.90 వేలు ధర పలికింది.
క్రికెట్ క్రీడాకారిణి త్రిషకు రేవంత్రెడ్డి అభినందనలు
గాంధీభవన్, న్యూస్టుడే: మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భారత జట్టును విశ్వ విజేతగా నిలపడంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ క్రీడాకారిణి గొంగడి త్రిషను పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అభినందించారు. ఈ విషయమై ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మన మట్టిలో పుట్టిన మరో ఆణిముత్యం. విశ్వ క్రీడా వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భద్రాద్రి ‘రామ బాణం’. లక్షలాది యువ తరంగాలకు మరో స్పూర్తి గీతం. మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భారత జట్టును విశ్వవిజేతగా నిలిపిన తెలంగాణ బిడ్డ త్రిషకు శుభాభినందనలు’ అని పేర్కొన్నారు.
ఈఎన్టీలో ఆరు పోస్టుల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యవిద్య డైరెక్టర్ పరిధిలోని ఈఎన్టీ విభాగాల మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (ఈఎన్టీ), మరో మూడు స్పీచ్ పాథాలజిస్టుల భర్తీకి ఆర్థికశాఖ సోమవారం అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని, మెడికల్ బోర్డు వెబ్సైట్లో ఇతర వివరాలు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలి
మంత్రి సబితారెడ్డికి హర్షవర్దన్రెడ్డి వినతి
గాంధీభవన్, న్యూస్టుడే: జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానికతను కల్పిస్తూ ఈ బదిలీల్లోనే వారికి అవకాశం కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత జి.హర్షవర్దన్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా ప్రస్తుత బదిలీల్లోనే అవకాశం కల్పించాలన్నారు.
నేడు కృష్ణా బోర్డు ఛైర్మన్ పదవీ విరమణ
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు అదనపు బాధ్యతలు
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య సంఘం (కేఆర్ఎంబీ) ఛైర్మన్ ఎంపీ సింగ్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. 2021 సంవత్సరం మే నెలలో ఆయన బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి శివ్ నందన్కుమార్ను అదనపు బాధ్యతలతో నియమించినట్లు తెలిసింది.
వరదల సమయంలో సేవలందించిన 17 మందికి గుర్తింపు
ప్రశంసాపత్రాలు అందించనున్న నీటిపారుదల శాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది జులై నెలలో వచ్చిన వరదల సమయంలో విశిష్ట సేవలు అందించిన 17 మంది ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వారికి మంగళవారం జలసౌధలో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించనున్నారు. ప్రధానంగా కడెం జలాశయం, గోదావరి తీరంలోని భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు వరదల నియంత్రణకు, ప్రాణనష్టం నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వారి సేవలు గుర్తించిన అధికారులు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. వీటికి ఎంపికైన వారిలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్.శంకర్, సంయుక్త కార్యదర్శి ఎస్.భీం ప్రసాద్, ఎస్ఈ సాజిద్, జలసౌధ నుంచి ప్లానింగ్-మేనేజ్మెంట్ ఎస్ఈ కె.శ్రీనివాస్, భద్రాద్రి సీఈ ఎ.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ కె.వెంకటేశ్వరరెడ్డి, డీఈఈ ఎస్.రామకిశోర్, నిర్మల్ ఎస్ఈ డి.సుశీల్కుమార్, కడెం ఈఈ సీహెచ్.రాజశేఖర్, డీఈఈ బి.రవికుమార్తోపాటు ఇతర సర్కిళ్ల ఏఈఈలు ఉన్నారు.
ఉత్తర తెలంగాణలో మరికొన్ని రోజులు చలి
ఈనాడు, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని రోజులపాటు చలితీవ్రత ఉండే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే గురువారం నుంచి శనివారం మధ్య 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడలో రాష్ట్రంలోనే కనిష్ఠంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
అసెంబ్లీ ముగిసేలోపు ఉద్యోగులకు ఈహెచ్ఎస్: శ్రీనివాస్గౌడ్
రవీంద్రభారతి, న్యూస్టుడే: అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ను ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ విశ్రాంత గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కాలమానిని, దైనందిని ఆవిష్కరణ సభలో మంత్రి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం