రాజ్భవన్ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడమా!
‘బ్రిటిష్ కాలంలో గవర్నర్ పదవికి ఒక అర్థం ఉండేది. పైన వైస్రాయ్ ఉంటే కింద గవర్నర్ ఉండేవారు.
గవర్నర్ వ్యవస్థను మోదీ అలానే వాడుకుంటున్నారు
ముఖ్యమంత్రిగా నీతులు చెప్పి.. ప్రధానిగా తుంగలో తొక్కారు
రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం..
రాష్ట్ర భాజపా ఎంపీలు గల్లీలో కాదు.. దిల్లీలో మాట్లాడాలి
మంత్రి కేటీఆర్ ధ్వజం
సిరిసిల్ల, ఈనాడు డిజిటల్: ‘బ్రిటిష్ కాలంలో గవర్నర్ పదవికి ఒక అర్థం ఉండేది. పైన వైస్రాయ్ ఉంటే కింద గవర్నర్ ఉండేవారు. ప్రధాని పేరును వైస్రాయ్గానైనా మార్చుకోవాలి.. లేదంటే గవర్నర్ వ్యవస్థనైనా ఎత్తివేయాలి.. ఈ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రధాని.. ఇతరులకు చెప్పే ముందు ఆలోచించుకుంటే మంచిది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు పరీక్షలను పరిశీలించారు. తర్వాత సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థపైనా.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు.. పార్టీలకు అనుకూలంగా.. చర్చల్లో పాల్గొనడం మానుకుంటే మంచిది. రాజభవన్ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. దేశంలో బ్రిటిష్ కాలపు చిహ్నాలు పోవాలని రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చినట్లు గతంలో మోదీ చెప్పారు. మరి గవర్నర్ల వ్యవస్థ కూడా బ్రిటిష్వారు పెట్టిందే కదా? అది ఎందుకు ఉండాలి.? ఆ పదవి వల్ల ఎవరికి ఉపయోగం? పీఎం, సీఎంలను ప్రజలు ఎన్నుకుంటున్నారు.. మరి గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారు?. ఈ వ్యవస్థ వద్దని సర్కారియా, పుంఛీ కమిషన్లే చెప్పాయి. రాజకీయాలు వదిలి రెండేళ్లు ఖాళీగా ఉన్నవారికే గవర్నర్ పదవి ఇవ్వాలని మోదీ గతంలో అన్నారు.. ప్రస్తుతం పాటించడం లేదు. ముఖ్యమంత్రిగా నీతులు చెప్పిన మోదీ.. ప్రధానిగా తుంగలో తొక్కారు.
దుర్మార్గాలను సవరించుకునేందుకైనా నిధులివ్వాలి..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం నెరవేర్చలేదు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, విద్యా సంస్థలు.. పారిశ్రామిక కారిడార్లు.. పరిశ్రమలకు రాయితీలు.. ఐటీ రంగం విస్తరణ.. ఇలా ఎన్నో రకాల వాగ్దానాలను పార్లమెంటు సాక్షిగా చట్టంలో పొందుపరిచినా వాటిలో ఏవీ నెరవేర్చలేదు. మోదీ అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ తొమ్మిదవది.. ఇదే చివరి బడ్జెట్.. నేనేమీ శాపం పెట్టడం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ తూతూ మంత్రమే.. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇదే చివరి అవకాశం. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికైనా మేల్కొని తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎనిమిదేళ్లు చేసిన దుర్మార్గాలను సవరించుకునేందుకైనా ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలి.
మా పన్నులను ఇతర రాష్ట్రాల్లో వాడుకున్నారు
రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.3.68 లక్షల కోట్లు కడితే.. రాజ్యాంగబద్ధంగా.. ఆర్థిక సంఘం నిబంధన ప్రకారం రూ.1.69 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో వసూలు చేసిన పన్నులను వేరే రాష్ట్రాల్లో వినియోగించారు. దీనికి ఉదాహరణే రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అధోగతి. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. ఎనిమిదేళ్లలో కొత్త రైల్వే లైను రాలేదు.. ఉన్నవి కూడా పూర్తి చేయలేదు. కాజీపేటకు కోచ్ ప్యాక్టరీ అడిగితే ఇక్కడ అవసరమే లేదంటారు. కానీ, మహారాష్ట్రలోని లాతూర్లో ఒకటి.. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో మరొకటి పెట్టారు. ఏడాదికి రూ.1000 కోట్లు నష్టం వస్తుందని రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలు ఎత్తివేయడం కన్నా అనాగరిక చర్య మరొకటి లేదు. మోదీ కూడా సీనియర్ సిటిజన్గా మారతారు.. అదైనా గుర్తుంచుకుని రాయితీలు పునరుద్ధరించాలి. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర భాజపా ఎంపీలు మేల్కొనాలి. నలుగురున్నా.. రాష్ట్రానికి నయాపైసా తేలేదు. ఇక్కడ గల్లీలో తిరుగుతూ సిల్లీ మాటలు మాట్లాడటం కాదు.. కేసీఆర్ను బూతులు తిడుతూ.. తిరగడం కాదు.. చేతనైతే దిల్లీలో మాట్లాడాలి. ఎంపీలుగా చేయాల్సిన పని చేయాలి.
విద్యా సంస్థలపైనా వివక్ష
రాష్ట్రానికి రావాల్సిన ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదు. కొత్తగా వైద్య కళాశాలలు ఇవ్వలేదు. ట్రిపుల్ఐటీ, ఐఐఎం వంటి సంస్థలనూ కేటాయించలేదు. సాగునీటి రంగంలో కాళేశ్వరం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో దేనికైనా ఒకదానికి జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ అతీగతీ లేదు. నేతన్నల కోసం మెగా పవర్లూం క్లస్టర్ తొమ్మిదేళ్లుగా అడుగుతూనే ఉన్నా స్పందన లేదు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ను అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఎకరానికి సంవత్సరంలో రూ.10 వేలు ఇవ్వాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ