ధర లేక పసుపు పంటకు పాతర
పసుపు రైతంటే గ్రామాల్లో ఒక హోదా.. పసుపు సాగంటే ఒక ఉత్సాహం.. ఇవన్నీ ఆయా రైతుల కుటుంబాల్లో గత వైభవాలుగా మిగిలిపోయాయి.
రాష్ట్రంలో 30 వేల ఎకరాలు తగ్గిన సాగు
తగ్గనున్న 90 వేల టన్నుల ఉత్పత్తి
ఆర్మూర్, న్యూస్టుడే: పసుపు రైతంటే గ్రామాల్లో ఒక హోదా.. పసుపు సాగంటే ఒక ఉత్సాహం.. ఇవన్నీ ఆయా రైతుల కుటుంబాల్లో గత వైభవాలుగా మిగిలిపోయాయి. ప్రతికూల పరిస్థితులు పసుపు సాగును పాతరేస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో రాష్ట్రంలో ఈ పంట సాగు, ఉత్పత్తి తగ్గుతోందని మార్కెటింగ్ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏటా ధరల పతనం, పెట్టుబడి ఖర్చులు పెరగడం, చీడపీడల ప్రభావం.. తదితర కారణాలతో ఈ పంట వేసేందుకు రైతులు సాహసించడం లేదు. రాష్ట్రంలో 2021-22 సీజన్లో 85,916 ఎకరాల్లో పసుపు పంట సాగు చేయగా.. 2,56,029 టన్నుల దిగుబడి వచ్చింది. 2022-23 సీజన్లో సాగు విస్తీర్ణం 56,073 ఎకరాలకు పరిమితం కాగా.. 1,67,092 టన్నుల ఉత్పత్తి రావచ్చని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. అంటే గత సాగు సంవత్సరంతో పోలిస్తే 30 వేల ఎకరాల సాగు తగ్గింది. ఉత్పత్తి 90 వేల టన్నుల వరకూ తగ్గనుంది.
2010లో క్వింటా పసుపు రూ.16 వేల పైచిలుకు పలికింది. ఆ తర్వాత ఏడాది నుంచి క్వింటాకు సగటు ధర అటు ఇటుగా రూ.8,500కి పరిమితమైంది. మూడేళ్లుగా పరిస్థితి దయనీయంగా ఉంది. గతేడాది రూ.7,400తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో సగటు ధర రూ.5,500 మాత్రమే ఉండటంతో రైతులు సాగుపై ఆసక్తి చూపలేదు. మరోవైపు అధిక వర్షాలు, చీడపీడలతో దిగుబడులు తగ్గి రైతులు అప్పులపాలవుతున్నారు.
శాస్త్రీయ పరిశోధనల్లో వెనుకంజ
కొత్త వంగడాలు, కర్క్యూమిన్ శాతం పెంచే రకాలు అందుబాటులోకి రాకపోవడం, యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వకపోవడం, సస్యరక్షణలో నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించకపోవడం తదితర కారణాలు ఈ పంట సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గేలా చేస్తున్నాయి. స్పైస్ బోర్డు సైతం సాగుదారులకు ఆశించిన స్థాయిలో సేవలందించడం లేదనే విమర్శ ఉంది. పరిశోధన స్థానాలకు సర్కారు పెద్దగా నిధులు కేటాయించకపోవడం, మద్దతు ధర ప్రకటించకపోవడం, ధర దక్కని సమయంలో కనీసం బోనస్లు ఇవ్వకపోవడం ప్రభావం చూపుతున్నాయి. దేశంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోనే అత్యధికంగా రైతులు ఈ పంట వేస్తుండగా.. వారే ప్రస్తుతం దూరమవుతున్నారు.
సగానికి తగ్గించేశా
మూడు దశాబ్దాల నుంచి.. ఏటా పదెకరాలకు తగ్గకుండా పసుపు సాగు చేస్తున్నా. ఈసారి అయిదున్నర ఎకరాలతోనే సరిపెట్టా. దీని స్థానంలో అయిల్పాం మొక్కలు నాటా. పసుపులో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు.
ఎం.రమేశ్రెడ్డి, నూత్పల్లి, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..