Budget 2023: రాష్ట్రానికి మరో‘సారీ’..!
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది. బడ్జెట్కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలన్నీ బుట్టదాఖలయ్యాయి.
తెలంగాణ సర్కారు వినతులు గాలికి..
ప్రత్యేక నిధులు లేవు.. అప్పులకూ తిప్పలు
మళ్లీ నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది. బడ్జెట్కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఆర్థికమంత్రి నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలకు బడ్జెట్లో స్థానం దక్కలేదు. పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అందే నిధులు మినహా రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విజ్ఞప్తులు చేసినా, మంత్రులు లేఖలు రాసినా ఎలాంటి ప్రత్యేక ఊరట లభించలేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆనాటి హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ప్రత్యేక తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా ఫలితం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక లేఖ ద్వారా పలు అంశాలను నివేదించింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకంగా నిధులివ్వాలని కోరారు. బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు కేంద్రానికి నివేదించారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఒక్క వినతిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరమైన హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక తోడ్పాటును రాష్ట్రం కోరింది. ప్రధానంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.8,453 కోట్లు ఇవ్వాలని కోరినా కేంద్రం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ప్రస్తావన లేకుండా పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర బడ్జెట్లో నిధుల తోడ్పాటును అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని అయిదేళ్ల కిందటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రత్యేక తోడ్పాటు కూడా రాష్ట్రానికి కరవైంది.
సిఫార్సులకూ దిక్కులేదు
తెలంగాణకు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.2,362 కోట్ల ప్రత్యేక నిధులివ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. గత బడ్జెట్లో దీన్ని ఆమోదించకపోగా ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగింది. వంద శాతం ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తున్న మిషన్ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం విన్నవించింది. కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. బీఆర్జీఎఫ్కు సంబంధించి తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు 2019-20 నుంచి ఇవ్వాల్సిన రూ.1,350 కోట్ల బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ వినతులూ గాలికి పోయాయి. హైదరాబాద్ మెట్రోతో పాటు వరంగల్ నియో మెట్రోకు నిధులను ఆశించినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల నుంచి పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులివ్వాలని కోరుతున్నా కేంద్రం ఈసారీ మొండిచెయ్యే చూపింది. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటాగా వచ్చే రూ.21,470 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఐఐఎం సహా ప్రముఖ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరినా ఈసారి కూడా ఒక్క విద్యాసంస్థనూ ప్రకటించలేదు. గతంలో రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించి రాష్ట్రానికి ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు.
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరగలేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బడ్జెట్ వెలుపల ప్రభుత్వ పూచీకత్తుతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావడంతో రాష్ట్రానికి నిధుల లభ్యతపై ప్రభావం చూపింది. కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణాల్లో కోత విధించడంతో రాష్ట్రం అంచనాల్లో సుమారు రూ.19,000 కోట్ల రుణాలను పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని, కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాలని కోరుతూ తెలంగాణ సర్కారు శాసనసభలో ప్రత్యేకంగా చర్చించి నివేదించింది. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచడంతో పాటు, కార్పొరేషన్ రుణాలను దాని పరిధి నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. జీఎస్డీపీలో ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతం కంటే పెంచాలన్న విజ్ఞప్తినీ పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు