మధ్యతరగతిని పక్కదారి పట్టించే బడ్జెట్
‘కేంద్రం ప్రవేశపెట్టింది రాజకీయ-ఆర్థిక బడ్జెట్. మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని గుర్తించి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కువగా జరిగినట్లు కనిపిస్తోంది’ అని ఆర్థిక శాస్త్రవేత్త, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.
పేదలు, అణగారిన వర్గాలను పట్టించుకోలేదు
ప్రభుత్వ పెట్టుబడుల పెంపు నిర్ణయం మంచిదే
వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘కేంద్రం ప్రవేశపెట్టింది రాజకీయ-ఆర్థిక బడ్జెట్. మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని గుర్తించి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎక్కువగా జరిగినట్లు కనిపిస్తోంది’ అని ఆర్థిక శాస్త్రవేత్త, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ మధ్యతరగతి కోసం ఎక్కువగా చేశామని చెప్పారన్నారు. ఆర్థికమంత్రి కూడా ఆదాయపన్ను గురించి చెప్తూ కష్టపడి పనిచేసే మధ్యతరగతి అంటూ మాట్లాడారన్నారు. మరి ఆ కష్టపడి పనిచేసే మధ్యతరగతి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకురాలేదన్నారు. పేద రైతులు, అణగారిన వర్గాల గురించి పట్టించుకోలేదన్నారు. కేంద్రబడ్జెట్పై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులు 2014-15 తర్వాత తగ్గిపోయాయి. మొత్తం పెట్టుబడులు కూడా 32 నుంచి 28 శాతానికి తగ్గాయి. ప్రైవేటు రంగంలో ఉత్పత్తి చేసిన వాటిలో 60 నుంచి 70 శాతానికి మించి మార్కెట్ కావడం లేదు. ఒకవైపు మిగులు ఉంటే ఇంకోవైపు అదనంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలనుకోవడం మంచిదే. మూడు సంవత్సరాల క్రితం కూడా దీని గురించి మాట్లాడారు. ఆలస్యమైనా సానుకూల నిర్ణయం వచ్చింది. మహిళల ప్రాధాన్యం గురించి కూడా ఎక్కువ మాట్లాడారు. ప్రధానమంత్రి స్వయం సహాయక సంఘాల గురించి చెప్పారు. ఈ సెల్ఫ్హెల్ప్ గ్రూపుల ప్రారంభం, నిర్వహణ, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రస్తుతం కేంద్రప్రభుత్వ పాత్ర ఏమీలేదు. సున్నా వడ్డీ సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినవే. వ్యవసాయరంగం గురించి బడ్జెట్లో చెప్పినవి చూస్తే అవి ఆ రంగాన్ని గట్టెక్కించే చర్యలు కాదనిపిస్తోంది. డిజిటల్, స్టార్టప్ల గురించి బడ్జెట్లో చెప్పినా వాటివల్ల వ్యవసాయరంగం మెరుగుపడదు. సహకారరంగాన్ని ప్రోత్సహించడం, గోడౌన్ల నిర్మాణానికి చర్యలు మంచివే. ప్రకటనలకు పరిమితం చేయకుండా కార్యరూపం దాల్చాలి. కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేస్తారో చూడాల్సి ఉంది. సన్న, చిన్నకారు రైతులకు పి.ఎం.కిసాన్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని రూ.ఆరువేల నుంచి రూ.ఎనిమిది వేలకు పెంచుతారనే ప్రచారం జరిగినా చేయలేదు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. ఈ రెండూ చూస్తే పేదలు, సన్న, చిన్నకారు రైతులకు ఏమీ చేయకపోయినా ఏం కాదులే అన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది’’ అని నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ