సంక్షిప్త వార్తలు(8)
వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 7 నుంచి 14 వరకు పరిశీలించనున్నట్లు నియామక సంస్థ గురువారం తెలిపింది.
7 నుంచి అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 7 నుంచి 14 వరకు పరిశీలించనున్నట్లు నియామక సంస్థ గురువారం తెలిపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, https://mhsrb.telangana.gov.in లో వివరాలను పరిశీలించాలని తెలిపింది.
పదోన్నతులకు ఎస్సైల వినతి
ఈనాడు, హైదరాబాద్: సీఐలుగా పదోన్నతుల కల్పనలో తమకు న్యాయం చేయాలని 2009 బ్యాచ్కు చెందిన పలువురు ఎస్సైలు కోరారు. మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలను గురువారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తమ బ్యాచ్లో మొత్తం 450 మంది ఎస్సైలుండగా.. 200 మంది సీఐలుగా పదోన్నతులు పొందారని తెలిపారు. వరంగల్ జోన్లోని 2012 బ్యాచ్కు చెందిన ఎస్సైలు సైతం సీఐలుగా పదోన్నతి పొందారన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల స్థాయి పెంచడంతో మల్టీజోన్-2లో 150 సీఐ పోస్టులు ఏర్పడ్డాయని, మరో 25 ఖాళీలు ఇప్పటికే ఉన్నాయని వివరించారు. 2009 బ్యాచ్లో మిగిలిన 230 మంది ఎస్సైలకు సీనియారిటీ ప్రకారం పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు.
డీజీపీ అంజనీకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎరిన్ ఫిషర్
హైదరాబాద్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్లో ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ఎరిన్ ఫిషర్ గురువారం డీజీపీ అంజనీకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు పనితీరును ఆమెకు డీజీపీ వివరించారు. పోలీసులపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు.
ఈనాడు, హైదరాబాద్
5న తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం
నారాయణగూడ, న్యూస్టుడే: హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఈ నెల 5వ తేదీన తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. గురువారం పరిషత్తులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరవాత తొలిసారిగా బాల సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో తెలంగాణలో ఇప్పటి వరకు వచ్చిన బాల సాహిత్యంపై సమీక్ష, బాల సాహిత్య రచన శైలి ఎలా ఉండాలి అన్న అంశంపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయని, ప్రతిభావంతులైన బాలలు తమ రచన అనుభవాలు పంచుకుంటారని వివరించారు. విద్యార్థులు కథ, కవిత, వ్యాసం తదితర రచనలు వెలువరించేందుకు తోడ్పాటునందిస్తున్న ఉపాధ్యాయులు తమ అనుభవాలను తెలియజేస్తారని అన్నారు. పరిషత్తు అధ్యక్షుడు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనానికి శాంతా బయోటెక్నిక్స్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి హాజరవుతారని చెప్పారు.
లక్ష్మీ పంపుహౌస్ నుంచి అయిదు టీఎంసీల ఎత్తిపోత
కాళేశ్వరం, న్యూస్టుడే: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీ పంపుహౌస్ మోటార్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మునిగిన మోటార్ల పునరుద్ధరణ అనంతరం గత నెల 4వతేదీ నుంచి వరుస క్రమంలో కొన్ని మోటార్లను నిత్యం రాత్రి వేళల్లో నడుపుతూ గోదావరి జలాలు ఎత్తిపోస్తుండగా, గ్రావిటీ కాల్వ ద్వారా సరస్వతీ బ్యారేజీకి చేరుకుంటున్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ అయిదు టీఎంసీలు సరస్వతీ బ్యారేజీకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
రానున్న మూడు రోజులు చలి వాతావరణం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు చలి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో 18 డిగ్రీల లోపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం, పటాన్చెరు ప్రాంతాల్లో 13.7 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బుధవారం తెల్లవారు జామున రాష్ట్రంలోనే కనిష్ఠంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 9.6, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.8, సంగారెడ్డి జిల్లా న్యాలకల్లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. గురువారం పగటిపూట రాష్ట్రంలోనే గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానంబైలులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా సాధించేలా ఏరియా జనరల్ మేనేజర్లు దృష్టిసారించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఒడిశాలోని నైనీ, కొత్తగూడెంలోని వీకే ఓపెన్కాస్ట్ నుంచి 80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గురువారమిక్కడ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, సలహాదారులు, ఏరియాల జీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి మూడు నెలల్లో రికార్డు స్థాయిలో రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇదే స్థాయిలో వర్షాకాలం వరకు ఉత్పత్తి, రవాణా కొనసాగిస్తే వచ్చే ఏడాదికి నిర్ణయించిన 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదు. రామగుండం-1, 2, 3 ఏరియాలో అన్ని గనులు గతం కన్నా మెరుగ్గా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. శ్రీరాంపూర్, మందమర్రి గనులు లక్ష్యాలకు చేరువగా ఉన్నాయి. భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలు మరింత మెరుగ్గా పనిచేయాలి. రానున్న రోజుల్లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల టెండర్లు సహా ఇతర ప్రక్రియలు మూడు నెలల ముందుగానే పూర్తిచేయాలి’ అని సీఎండీ మార్గదర్శనం చేశారు.
గిరిజన ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ విడుదల చేయాలి: టీపీటీఎఫ్
ఈనాడు, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని ఆ శాఖ అదనపు డైరెక్టర్ వి.సర్వేశ్వర్రెడ్డికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.అశోక్కుమార్, ముత్యాల రవీందర్ గురువారం విజ్ఞప్తి చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని అదనపు డైరెక్టర్ తెలిపినట్లు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక