పెండింగ్ ప్రాజెక్టులకు పచ్చజెండా!
కేంద్ర బడ్జెట్లో రైల్వేపరంగా రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాలేదు. అయితే ఇప్పటికే మంజూరై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది.
కేంద్రబడ్జెట్లో ఎంఎంటీఎస్కు భారీగా కేటాయింపు
‘రామగుండం- మణుగూరు’కు మోక్షం
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రైల్వేపరంగా రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాలేదు. అయితే ఇప్పటికే మంజూరై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది. గతేడాది రూ.3,045 కోట్లతో పోలిస్తే ఈసారి 45% పెంచి రూ.4,418 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చిక్కుముడి కారణంగా చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్లో కొన్నిటికి మోక్షం కలిగించింది. ఇందులో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ, రామగుండం-మణుగూరు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. భద్రాచలం-కొవ్వూరు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఈసారి కూడా సాకారంకాలేదు. సర్వే పూర్తయిన రైల్వే లైన్ల మంజూరును పట్టించుకోలేదు. కొత్త సర్వేల జోలికి వెళ్లలేదు. రైల్వేశాఖ జోన్ల వారీగా పింక్ బుక్ కేటాయింపులను పరిశీలిస్తే- నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు ముఖ్యంగా రద్దీ మార్గాల్లో మూడో లైను పనులకే కొంత ప్రాధాన్యం లభించింది.చర్లపల్లి టెర్మినల్కు, కాజీపేటలో వ్యాగన్ వర్క్షాప్నకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు లభించాయి.
* హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశకు రెండేళ్లుగా రూ.పదేసి లక్షలే కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ ఇస్తేనే నిర్మాణపనులు పూర్తవుతాయని చెబుతూ వచ్చింది. ఈసారి వైఖరి మార్చుకుని బడ్జెట్లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించింది. దీంతో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నగర ప్రయాణికులకు చౌక ప్రయాణం అందుబాటులోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. రామగుండం-మణుగూరు ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రైల్వేశాఖ భరించే అవకాశాలున్నాయి.
కొత్త రైల్వే లైన్లు
* మనోహరాబాద్-కొత్తపల్లి: రూ.185 కోట్ల నిధులు కేటాయించారు. 2006-07లో మంజూరైన 151 కిమీల ఈ మార్గం అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి మూడో వంతు ఖర్చు భరిస్తోంది. ప్రస్తుతం మనోహరాబాద్-కొడకండ్ల 44 కిమీ దూరం పూర్తయ్యింది. భూసేకరణ త్వరితగతిన జరగాలని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.
* మహబూబ్నగర్-మునీరాబాద్: రూ.345 కోట్లు కేటాయించారు. 1997-98లో మంజూరైన ఈ మార్గం పొడవు 244 కిమీ.లు. 68 కిమీ తెలంగాణలో, 178 కిమీ మహారాష్ట్రలో ఉంది. అంచనా వ్యయం రూ.1,723 కోట్లు. ప్రస్తుతం దేవరకద్ర-మాగనూరు 54 కిమీ మార్గం పూర్తయ్యింది. మాగనూరు-కృష్ణా స్టేషన్ల మధ్య పనులు తాజాగా పూర్తయ్యాయి. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్ ఒకట్రెండు రోజుల్లో రానుంది. దీంతో మహబూబ్నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు కృష్ణా వరకు ప్యాసింజర్ రైళ్లు నడపడానికి అవకాశం ఏర్పడింది.
* భద్రాచలం రోడ్-కొవ్వూరు: రూ.20 కోట్లు కేటాయించారు. 151 కిమీ.ల ఈ మార్గం 2012-13లో మంజూరైంది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.2,154.83 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో వాటా విషయంలో చిక్కుముడి ఏర్పడింది. దీంతో ఏటా రూ.లక్ష నిధులే కేంద్రం మంజూరు చేస్తోంది. మరోవైపు సింగరేణి భాగస్వామ్యంతో భద్రాచలంరోడ్-సత్తుపల్లి వరకు రైల్వేశాఖ రైలు మార్గం నిర్మించింది. తెలంగాణలోని సరిహద్దు సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు రైలే మార్గం నిర్మిస్తే సికింద్రాబాద్-విశాఖపట్నం వైపు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల ప్రాంతాల నుంచి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం నౌకాశ్రయాలను ఈ మార్గం అనుసంధానం చేస్తుంది.
* మణుగూరు-రామగుండం: ఈ బడ్జెట్లో కేటాయించింది రూ.10 కోట్లు. 200 కిమీ.ల ఈ మార్గాన్ని 2013-14లో మంజూరు చేశారు. తొమ్మిదేళ్లుగా ముందడుగు పడకపోవడంతో అంచనా వ్యయం రూ.1,112 కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది.
* సర్వే పూర్తయిన కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్ ప్రతిపాదిత రైల్వే లైన్ని మంజూరుచేస్తారని భావించగా రైల్వేశాఖ నిరాశపరిచింది. లింగంపల్లి-వికారాబాద్ రెండోలైను మంజూరు కాలేదు. యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ గురించి పట్టించుకోలేదు.
* ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు మూడో లైను నిర్మిస్తే దిల్లీ, విజయవాడ వైపు రాకపోకలు సులభం అవుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ ప్రాధాన్యం ఇవ్వలేదు. వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్, కాచిగూడతో పాటు ఏపీలోని తిరుపతి స్టేషన్లలో పిట్ లైన్లను ద.మ.రైల్వే అభివృద్ధి చేసింది.
డబ్లింగ్/థర్డ్ లైన్లు
* 220 కిమీ.ల కాజీపేట-విజయవాడ మూడో లైను అంచనా వ్యయం రూ.1,953 కోట్లు కాగా ఈ ఏడాది రూ.337.52 కోట్లు కేటాయించారు.
* 201 కిమీ. పొడవైన కాజీపేట-బల్లార్ష మూడో లైను పనులకు రూ.450.86 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.2,063 కోట్లు.
* 248 కిమీల బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనుల అంచనా వ్యయం రూ.2,480 కోట్లకుగాను ఈ బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించారు.
* కాజీపేట 10.65 కి.మీ.ల బైపాస్ లైనుకి నిధులిచ్చారు. పగిడిపల్లి-నల్లపాడు విద్యుద్దీకరణ పనులకు రూ.32.8 కోట్లు... జోన్ పరిధిలో స్టేషన్ల అభివృద్ధికి రూ.215 కోట్లు ఇచ్చారు.
* కాజీపేట వర్క్షాప్నకు రూ.160 కోట్లు, చర్లపల్లి టెర్మినల్కు రూ.82 కోట్లు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.