K Viswanath: తరలిపోయిన తపస్వి
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
విశ్వనాథ్కు కన్నీటి వీడ్కోలు
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
బహుముఖ ప్రజ్ఞాశాలి: ప్రధాని సంతాపం
ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, ఫిలింనగర్, బంజారాహిల్స్: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఆరాధ్య సంప్రదాయ ప్రకారం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరణవార్తను తెలుసుకొని శుక్రవారం తెల్లవారుజాము నుంచే అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఫిలింనగర్లోని ఆయన స్వగృహానికి చేరుకొని నివాళులు అర్పించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సినిమాను ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఖ్యాతి విశ్వనాథ్కే దక్కుతుందని, దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫిలింనగర్లోని ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఆయన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తరఫున విశ్వనాథ్ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్రలో ఎంపీ సంతోష్కుమార్, తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సినీనటులు తులసి, ఏడిద శ్రీరాం, ఏడిద రాజా, అనంత్ తదితరులు విచ్చేశారు. ఏపీ సీఎం జగన్ తరఫున విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు అంతిమయాత్రకు హాజరైన ఆ రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
ఫిలింనగర్లోని విశ్వనాథ్ నివాస ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్కల్యాణ్, నాగబాబు, వెంకటేశ్, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, గుణశేఖర్, అల్లు అరవింద్, డి.సురేశ్బాబు, ఆదిశేషగిరిరావు, బ్రహ్మానందం, అలీ, వందేమాతరం శ్రీనివాస్, కోట శ్రీనివాసరావు, అశోక్కుమార్, రాజమౌళి, కీరవాణి, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మాజీ, మణిశర్మ, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, ఆర్.నారాయణమూర్తి, జీవిత రాజశేఖర్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
పలువురి సంతాపం
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.
ఆయన కీర్తి అజరామరం
తెలంగాణ సీఎం
దర్శకుడు విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథలను కూడా తన అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు విశ్వనాథ్ అని, ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగోలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక, సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని ప్రస్తుతించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
ప్రధాని మోదీ
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగంలో విశ్వనాథ్ దిగ్గజం వంటివారని, తనను తాను సృజనాత్మక, బహుముఖీన దర్శకుడిగా ఆవిష్కరించుకున్నారని ప్రస్తుతించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.
తెలుగు సినిమాకు తీరనిలోటు
తెలంగాణ గవర్నర్
విశ్వనాథ్ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. అద్భుత ప్రతిభతో దిగ్గజ దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా, నటుడిగా సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అవార్డులు ఆయన ప్రతిభకు దర్పణాలు
రాహుల్
దర్శక దిగ్గజం విశ్వనాథ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయిదు జాతీయ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ పురస్కారాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు దర్పణాలని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులకు, అభిమానులకు తన సంతాపం తెలిపారు.
తీవ్రంగా కలచివేసింది
తెదేపా అధినేత చంద్రబాబు
‘కె.విశ్వనాథ్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో అపురూపు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
తెలుగు సినిమాకు తీరని లోటు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, అమరావతి: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి తెలుగుచలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
కళలకు నిలువుటద్దం
ఏపీ సీఎం జగన్
తెలుగువారి గుండెల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు ఆయన నిలువుటద్దం. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
ఆయన జ్ఞాని
పవన్ కల్యాణ్
సినిమా స్థాయిని, తెలుగు దర్శకుల సృజనను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్ శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదన చెందా. ఆయన్ను ఎప్పుడు కలిసినా జ్ఞాని కళ్లముందున్నట్టే అనిపించేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు