బీసీల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తా
బీసీల న్యాయమైన డిమాండ్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్ అథవాలె హామీఇచ్చారు.
కేంద్రమంత్రి రాందాస్ అథవాలె
ఖైరతాబాద్, న్యూస్టుడే: బీసీల న్యాయమైన డిమాండ్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్ అథవాలె హామీఇచ్చారు. శుక్రవారం లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో బీసీ పొలిటికల్ ఐకాస తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అధ్యక్షతన వివిధ బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జనగణన, రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఐకాసకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు లేనోళ్లు రాజ్యమేలుతున్నారన్నారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రంలో కేసీఆర్ ముగ్గురికే ఇచ్చారన్నారు. బీసీలు పోరాడి రాజకీయంగా ఎదిగి హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య, వాల్మికి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేపల్లె కృష్ణనాయుడు, ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, ఆర్పీఐ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర్రావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?