Vani Jayaram: మూగబోయిన సుస్వరాల ‘వాణి’
వంటి వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇకలేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది.
చెన్నైలో కన్నుమూసిన మధురగాయని
19 భాషల్లో వేల పాటలతో శ్రోతలను అలరించిన వాణీజయరాం
న్యూస్టుడే, చెన్నై (కోడంబాక్కం)
‘నేనా... పాడనా పాటా...’ అంటూనే పూజలు చేయ పూలు తెచ్చాను...
దొరకునా ఇటువంటి సేవ...
తెలిమంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ....
ఆనతినీయరా హరా...
మానస సంచరరే...
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా....
ఒక బృందావనం.... సోయగం...
అందెల రవమిది పదములదా...
వంటి వేల పాటలకు తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన సుమధుర గాయని ఇకలేరన్న వార్త శ్రోతలు, సినీ అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం(78) చెన్నైలో కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని నుంగంబాక్కంలోని తన గృహంలో తలకు గాయాలు, రక్తస్రావంతో పడి ఉన్న ఆమెను సన్నిహితులు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. థౌజండ్లైట్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మంచం నుంచి జారిపడి గాయాలైనందువల్లే ఆమె కన్నుమూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు. పిల్లలు లేకపోయినా సంగీతమే ఆ లోటు తీర్చిందని పలు సందర్భాల్లో చెప్పారు వాణి.
పాట ఏదైనా తనదైన గాత్రం
ఆమె 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరుకు చెందిన దురైస్వామి, పద్మావతి దంపతులకు జన్మించారు. అసలు పేరు కలైవాణి. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించడంతో పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పదేళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. దీంతోపాటు నాటకాలు, కవితలు చదివి శ్రోతలను మెప్పించారు. అలా 1970లో ‘గుడ్డీ’ అనే హిందీ చిత్రంలో ‘బోలే రే’ అనే పాటతో గాయనిగా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ఆమె పాడిన తొలిపాటే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. సుశీల, జానకి లాంటి గాయనీమణుల హవా కొనసాగిస్తున్న సమయంలో తనదైన గానంతో అలరించారు వాణి. ‘అభిమానవంతుడు’ చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి...’ పాటతో తెలుగులో తొలిసారి ఆమె గొంతు వినిపించింది. ఆ తర్వాత ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటతో బాగా పాపులర్ అయ్యారు. ‘ఏళు స్వరంగల్కుళ్’, ‘అపూర్వ రాగంగళ్’, ‘అండమాన్ కాలనీ’, ‘పాదపూజై’ ‘అవన్దాన్ మణిదన్’, ‘రోజాపూ రవిక్కైక్కారి’, ‘మీనవ నన్బన్’ లాంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించారు. శాస్త్రీయం, జానపదం, బీట్... ఇలా ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, ఆంగ్లం వంటి 19 భాషల్లో వేల పాటలు పాడారు. ఏ భాషలో పాడినా ఆ భాషలోని స్పష్టతను గొంతులో పలికించడం వాణీజయరాం ప్రత్యేకత.
మూడు జాతీయ పురస్కారాలు
తన అమృత గాత్రంతో వెండితెరపై రసభరిత గీతాల్ని ఒలికించిన వాణీ జయరాం... తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 1976లో వచ్చిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’తో ఉత్తమ గాయనిగా తొలి జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె.. ఆ తర్వాత ‘శంకరాభరణం’లోని మానస సంచరరే, ‘స్వాతికిరణం’లోని ఆనతి నీయరా హరా గీతాలతో మరో రెండు జాతీయ అవార్డుల్ని దక్కించుకున్నారు. ఇక ఫిల్మ్ఫేర్ సహా మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న వాణీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కానీ, ఆమె దాన్ని అందుకోకుండానే తుది శ్వాస విడవడం విచారకరం.
వాణీ జయరాం మృతిపై ప్రధాని, సీఎం సంతాపం
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆమె మరణం సృజన ప్రపంచానికి తీరని లోటని ట్వీట్ చేశారు. వాణీ జయరాం మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేల పాటలు పాడిన వాణీ జయరాం మరణం భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు వాణీ జయరాం మృతిపై సంతాపం తెలిపారు.
పాడిన తొలిపాటకే అయిదు అవార్డులు సాధించడమే కాకుండా మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా వాణీజయరాం గుర్తింపు పొందారని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. వాణీజయరాం మృతికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ‘మధురగాయని ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని శనివారం ట్వీట్ చేశారు. వాణీజయరామ్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట