Telangana Budget 2023: బాహుబలి బడ్జెట్!
తెలంగాణ ప్రభుత్వం మరో భారీ బడ్జెట్ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర బడ్జెట్ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల స్థాయిని దాటనుంది.
రూ.3 లక్షల కోట్లు దాటనున్న పద్దు
సంక్షేమం.. పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యం
సొంత రాబడులపై ధీమా
15 నుంచి 17 శాతం వృద్ధిరేటు అంచనా
నేడే రాష్ట్ర బడ్జెట్; ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ బడ్జెట్ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర బడ్జెట్ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల స్థాయిని దాటనుంది. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి దీని లక్ష్యంగా కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది వృద్ధిరేటును 15 నుంచి 17 శాతం మేర అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో 2023-24 రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు గత ఏడాది కంటే ఈసారి నిధులు పెంచుతున్నట్లు సమాచారం. సొంత రాబడులపై పూర్తి విశ్వాసంతో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు వచ్చిన రాబడి ఆధారంగా.. ఆర్థికశాఖ వచ్చే ఏడాది పన్నుల ఆదాయాన్ని సుమారు రూ. 1.5 లక్షల కోట్లుగా, పన్నేతర ఆదాయం, రుణాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మరో రూ. లక్షన్నర కోట్లుగా అంచనా వేసినట్లు తెలిసింది. దళితబంధు, రైతుబంధు, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంతో పాటు సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం వంటి కార్యక్రమాలకు అత్యధిక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని తెలుస్తోంది. వ్యవసాయ రుణమాఫీకి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్లో కేటాయింపులను భారీగా పెంచుతూ.. భారీ అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ వెలుపల రుణాలకు ప్రయత్నించనున్నట్లు తెలిసింది.
సొంత రాబడులే కీలకం
కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి రూ.21,470 కోట్లు అందనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులూ రానున్నాయి. భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ.15,550 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేయగా డిసెంబరు వరకు రూ.8000 కోట్ల మేర సమకూరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భూముల అమ్మకం ద్వారా భారీ రాబడిని సర్కారు ఆశిస్తోంది. అమ్మకం పన్ను రాబడి అంచనాలు రూ.40,000 కోట్లకు పైగా చేరాయి. జీఎస్టీ ఆదాయం కూడా రూ.42 వేల కోట్లను దాటనుంది. ఎక్సైజ్ రాబడిలో సాధారణ వృద్ధిరేటుతో అంచనాలు వేశారు. స్టాంపులు- రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం వచ్చే ఏడాది రూ.18 వేల కోట్లు దాటనుందని అంచనా. గనులు, భూగర్భ వనరుల ద్వారా రూ.9000 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,000 కోట్లు అంచనా వేయగా వాస్తవంగా అందులో 20 శాతం లోపే వచ్చింది. అయినా వచ్చే ఏడాది కూడా గ్రాంట్ ఇన్ఎయిడ్పై ఆశతోనే బడ్జెట్ అంచనాలను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం బడ్జెట్ వెలుపల రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావడంతో రూ.55,530 కోట్ల అంచనాల్లో రూ.19,000 కోట్ల మేర కోత పడింది. ఈసారి కూడా ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరగకపోయినా జీఎస్డీపీ పెరుగుదలను ప్రభుత్వం భారీగా అంచనా వేస్తోంది.
ఆసుపత్రుల నిర్మాణానికి రూ.4000 కోట్ల రుణం
ఆదివారం సమావేశమైన మంత్రిమండలి 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఇతర అంశాలపై చర్చించింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్లో నిర్మించే మరో మూడు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.4000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్ సమీపంలోని రాజంపేట గ్రామ పంచాయతీల ఏర్పాటుకు తీర్మానం చేసింది. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసిఫాబాద్ పంచాయతీలోని ఏజెన్సీ గ్రామమైన రాజంపేటను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చి.. మిగిలిన ప్రాంతాన్ని పురపాలికగా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్