పాత పింఛన్లను అడ్డుకుంటున్న కేంద్రం: స్థితప్రజ్ఞ
పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని పాత పింఛను విధానం పునరుద్ధరణ సాధన సమితి జాతీయ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు.
ఈనాడు, హైదరాబాద్: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని పాత పింఛను విధానం పునరుద్ధరణ సాధన సమితి జాతీయ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. పాత విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలకు తోడ్పాటు ఇవ్వాల్సిన కేంద్రం ఆంక్షలతో అడ్డుకోవడం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర విధానాలు కార్పొరేట్కు అనుకూలంగా ఉంటున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టం చేయదని, రద్దు చేస్తున్న రాష్ట్రాలకు అడ్డుపుల్లలు వేస్తోందన్నారు. ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిలోకి తీసుకురావడం కంటే అన్యాయం మరొకటి లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్