వరంగల్ నగరంలోనూ.. ‘కాక్లియర్ ఇంప్లాంటేషన్’!
పుట్టుకతోనే వినికిడి సమస్యలున్న చిన్నారులకు ఇది ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో ఉన్న కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని త్వరలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంజీఎంలో ఏర్పాటుకు యోచన
వినికిడి సమస్యలున్న చిన్నారులకు ఊరట
ఈనాడు, హైదరాబాద్: పుట్టుకతోనే వినికిడి సమస్యలున్న చిన్నారులకు ఇది ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో ఉన్న కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని త్వరలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏంటీ శస్త్రచికిత్స
జన్యు, ఇతర కారణాల వల్ల పుట్టుకతోనే చాలామంది పిల్లల్లో వినికిడి లోపం తలెత్తుతుంది. అవగాహన లేకపోవడంతో పిల్లలకు 3-4 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. వినికిడి శక్తి లేకపోతే మాటలు కూడా రావు. ఇలాంటి వారికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఒక్కటే శరణ్యం. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10-15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.6.5 లక్షల వరకు సాయం అందిస్తోంది. హైదరాబాద్లోని ఈఎన్టీ, గాంధీ ఆసుపత్రుల్లో ఈ సర్జరీలు చేస్తున్నారు. అయితే దూరప్రాంతాల నుంచి చిన్నపిల్లలతో హైదరాబాద్కు వచ్చి శస్త్రచికిత్సకు చేయించడం చాలామందికి ఇబ్బందికరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం వరంగల్ ఎంజీఎంలోనూ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఏవీటీ సేవలే కీలకం
పిల్లలకు సర్జరీ అనంతరం అందించే ఆడిటరీ వెర్బల్ థెరపీ (ఏవీటీ) కీలకం. ఇందులో భాగంగా పిల్లలకు తొలుత చిన్నచిన్న శబ్దాలు వినిపిస్తూ.. వివిధ ధ్వనులను పరిచయం చేస్తారు. వినికిడి శక్తి క్రమంగా పెరిగేలా శిక్షణ కూడా ఇస్తారు. అయితే జిల్లాల నుంచి వచ్చేవారికి ఏవీటీ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఏడాది పాటు పిల్లలతో ఇక్కడ ఉండే పరిస్థితులు లేక తల్లిదండ్రులు ఒకటి, రెండు నెలల శిక్షణ అనంతరం వెళ్లిపోతున్నారు. ఫలితంగా సర్జరీలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి వారి కోసం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలోని జీహెచ్ఎంసీ నెట్ షెల్టర్లో వసతి కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ 15 మంది వరకు తల్లిదండ్రులు తమ చిన్నారులతో ఉంటూ ఏవీటీకి హాజరవుతున్నారు. మరికొందరు గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెస్తే ఎంతోమంది చిన్నారులకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!