ఈ కప్పులు.. కబడ్డీలో ప్రతిభకు మెప్పులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టగానే ఎదురుగా గోడ సజ్జపై కప్పులు, షీల్డులు, ఇతరత్రా బహుమతులు దాదాపు వందకు పైగా కనిపిస్తాయి.
న్యూస్టుడే, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టగానే ఎదురుగా గోడ సజ్జపై కప్పులు, షీల్డులు, ఇతరత్రా బహుమతులు దాదాపు వందకు పైగా కనిపిస్తాయి. ఈ గ్రామానికి చెందిన కబడ్డీ జట్లు రెండున్నర దశాబ్దాలుగా వివిధ పోటీల్లో ప్రతిభ చాటుతూ సాధించిన బహుమతులు ఇవి. కబడ్డీలో ప్రతిభతో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలూ సాధించారు. ఇటీవల నూకలమర్రిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లోనూ ఈ ఊరి జట్టు విజేతగా నిలిచింది. అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఇటీవల గ్రామానికి వెళ్లిన కలెక్టర్ అనురాగ్ జయంతి పంచాయతీ కార్యాలయంలోని కప్పులు, షీల్డులను చూసి ఆరా తీశారు. గ్రామ క్రీడాకారుల ప్రతిభను తెలుసుకుని.. గ్రామంలో అధునాతన కబడ్డీ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహకారం అందించేందుకూ సుముఖత వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సుమారు 50 మంది క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో సత్తా చాటుతూ బహుమతులు గెలుచుకొని రావడం గ్రామానికి గర్వకారణమని సర్పంచి జైపాల్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్