3 వేల ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ
రాష్ట్రంలో వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ(టీఎంవీ) పేరిట ప్రత్యేకంగా విద్యుత్ వాహన క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
వచ్చే ఐదేళ్లలో విద్యుత్ వాహన రంగంలో రూ.50వేల కోట్ల భారీ పెట్టుబడులు
జహీరాబాద్, సీతారాంపూర్, దివిటిపల్లి, ఎంకతలల్లో ప్రత్యేక క్లస్టర్లు
4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ఈనాడు- హైదరాబాద్- న్యూస్టుడే, రాయదుర్గం: రాష్ట్రంలో వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ(టీఎంవీ) పేరిట ప్రత్యేకంగా విద్యుత్ వాహన క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీఎంవీతో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వాహన రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో పాటు.. 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 4 మెగా క్లస్టర్లను నగరం చుట్టూ ఏర్పాటు చేస్తోందన్నారు. జహీరాబాద్, సీతారాంపూర్లలో విద్యుత్ వాహనాల తయారీ క్లస్టర్లను, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(ఈఎస్ఎస్)ను, వికారాబాద్ ఎంకతలలో ఇన్నోవేషన్ క్లస్టర్ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ వాహన వారోత్సవంలో భాగంగా సోమవారం మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సదస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
వంద ఎకరాల్లో వాహనాలను పరీక్షించే ప్రత్యేక మైదానం
విద్యుత్ వాహన రంగ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అత్యుత్తమ మౌలిక సదుపాయాలకు గమ్యస్థానంగా నిలపడంలో టీఎంవీ ముఖ్య పాత్ర పోషిస్తుందని కేటీఆర్ చెప్పారు. ‘‘సుస్థిర రవాణాలో అధునాతన రసాయన, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్, ఒకటి, రెండో దశ పరికరాల తయారీదారులకు, ఆటో ఇంజినీరింగ్, పరిశోధన- అభివృద్ధి సంస్థలకు అనువుగా ఉంటుంది. ఎంకతలలో వివిధ ప్రయోగశాలలు ఉంటాయి. భారత్లోనే తొలిసారి వంద ఎకరాల్లో వాహనాలను పరీక్షించే ప్రత్యేక మైదానం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. జర్మనీకి చెందిన ఏటీఎస్ రీన్ల్యాండ్ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులతో అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈఎస్ఎస్లో వివిధ బ్యాటరీలకు సంబంధించిన సంస్థలు ప్రారంభమవుతాయి. టీఎంవీలో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ లభిస్తుంది. విద్యా సంస్థలను, పరిశ్రమను అనుసంధానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వాహన రంగ సైబర్ భద్రతలో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కూడా టీఎంవీ అందుబాటులోకి తెస్తుంది. రవాణా రంగ అంకుర సంస్థలకూ దన్నుగా నిలుస్తుంది. ఇందుకు టీహబ్ పలు వాహన రంగ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇప్పటికే టీఎంవీలో ప్రముఖ సంస్థలు సానుకూలంగా స్పందించి పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. మరో రెండు వారాల్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విద్యుత్ వాహనాల వాడకంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది’’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, భారత్ వోల్వో గ్రూప్ అధ్యక్షుడు కమల్ బాలి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఎంకతలలో ఏర్పాటు చేయనున్న టీఎంవీ క్లస్టర్ నమూనాను, టీఎస్ఈవీ యాప్ను ఆవిష్కరించారు. పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఉబెర్ ఇ-మొబిలిటీ సమావేశంలో....
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించడంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తోందని కేటీఆర్ తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈవీ జోరు కొనసాగే అవకాశాలున్నాయని హామీ ఇవ్వగలనన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్, ఉబెర్ భాగస్వామ్యంతో సోమవారం ఉబెర్ హైదరాబాద్ టెక్ సెంటర్లో నిర్వహించిన ఇ-మొబిలిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి