నిధుల పారుదలే!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..మరోసారి ఆ రంగానికి పెద్దపీట వేసింది.
వచ్చే ఏడు సాగునీటి శాఖకు రూ.26,885 కోట్లు
గతేడు కన్నా సుమారు రూ.6 వేల కోట్లు అదనం
కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం వడ్డీలకే..
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..మరోసారి ఆ రంగానికి పెద్దపీట వేసింది. 2023-24వ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.26,885 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ కేటాయింపుల కంటే ఇది సుమారు రూ.6 వేల కోట్లు అదనం. అయితే ఇందులో అధిక మొత్తం ఇప్పటికే తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించే అసలు, వడ్డీకే పోనుంది. దీంతోపాటు ఇతర నిర్వహణ వ్యయం పోనూ భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల పనుల కోసం సుమారు రూ.పదివేల కోట్లు మాత్రమే ఖర్చుచేయడానికి అవకాశం ఉంటుందని అంచనా. దీన్నిబట్టి చూస్తే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలపైనే పలు ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి ఆధారపడి ఉండనుంది. మొత్తం నిధుల్లో కాళేశ్వరానికే సింహభాగం కేటాయించారు. రూ.26,885 కోట్లలో రూ.15,200 కోట్లు(సుమారు 60%) దానికే ఖర్చుచేయనున్నట్టు సర్కారు పేర్కొంది. అయితే, అందులో రూ.12,500 కోట్లు ఇప్పటివరకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీతోపాటు అసలు తిరిగి చెల్లించడానికి వెచ్చించనున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజూ ఎత్తిపోసే రెండు టీఎంసీల నీటిని ఆయకట్టుకు సరఫరా చేసేలా పనులు పూర్తిచేయడానికి మరో రూ.పది వేల కోట్ల వరకు అవసరం. ఈ ప్రాజెక్టులో భాగంగా సింగూరు వద్ద చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలున్నాయి. ఈ రెండింటికీ నాబార్డు ద్వారా రుణం కోసం ప్రయత్నించినా ఇంకా కొలిక్కి రాలేదు. అదనపు టీఎంసీ పనికి మంజూరైన రుణం విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత కేటాయింపులో నిర్వహణ వ్యయం పోనూ ఈ పనుల కోసం మిగిలింది రూ.2,650 కోట్లు మాత్రమే. అందుకే కేటాయింపుల్లో ఈ మొత్తాన్నే చూపారు.
నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ రుణాలకు రూ.3,200 కోట్లు
సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, కంతనపల్లి, శ్రీరామసాగర్ వరద కాలువ ప్రాజెక్టుల కోసం తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సర్కారు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంది. ఇందులో దేవాదుల, వరద కాలువల తాలూకూ రుణానికి అసలు తిరిగి చెల్లించడం ప్రారంభించడంతోపాటు, మిగిలిన ప్రాజెక్టుల రుణాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.3,200 కోట్లు కేటాయించారు.
రుణాలు మంజూరైతేనే పురోగతి
సీతారామ ఎత్తిపోతలకు రూ.950 కోట్లు ఇచ్చారు. వాస్తవంగా ఈ పథకంలో మిగిలిన పనులు పూర్తిచేయడానికి రూ.మూడు వేల కోట్లు, ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల పనులకు మరో రూ.3,500 కోట్లు అవసరం. బ్యాంకులు రూ.8 వేల కోట్లు మంజూరుచేసి రూ.5,600 కోట్లు ఇచ్చాయి. మరో రూ.2400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలు కొంత కాలంగా విడుదల కావడం లేదు. ప్రస్తుత కేటాయింపులు ఆయకట్టు లక్ష్యానికి తగ్గట్లుగా పనులు పూర్తి చేయడానికి సరిపోవు. అంటే ఇక్కడా రుణాలపైన ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది.
* రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పనులు 75 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, కొన్నిచోట్ల ప్రధాన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలన్నది లక్ష్యం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్.ఎల్.బి.సి, దేవాదుల, వరదకాలువ, చిన్న కాళేశ్వరం, దిండి తదితర పథకాల కింద ఆయకట్టు లక్ష్యం ఉంది. ప్రస్తుత కేటాయింపులు దీనికి తగ్గట్లుగా లేకపోయినా, కేటాయించిన నిధులు విడుదలచేస్తే కొంతవరకైనా ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట
ఇక మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ఈ బడ్జెట్లో రూ.335 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చెరువుల పునరుద్ధరణ, బాగుకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.1,300 కోట్లు కేటాయించింది. నిర్వహణకు రూ.380 కోట్లు ఇచ్చింది.
‘పాలమూరు’ పరుగుపెట్టేనా?
రాష్ట్రంలోని మరో ప్రధాన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.23 వేల కోట్లు ఖర్చుచేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీలతో సహా మొత్తం పనులు పూర్తి చేయాలంటే మరో రూ.35 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అంచనా. ఇంకా డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టలేదు కాబట్టి నిర్మాణంలో ఉన్న పనుల వరకు పూర్తిచేయడానికే మరో రూ.18 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. బడ్జెట్లో రూ.1,200 కోట్లు మాత్రమే కేటాయించినందున, తీసుకోబోయే రుణం మీదనే ఎక్కువగా ఆధార పడక తప్పని పరిస్థితి. రుణం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతే పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు