సకల జనుల కోసం..
రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చింది.
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.33,416 కోట్లు
రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2023-24 బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచింది. ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి పథకాలు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలకు ప్రాధాన్యమిచ్చింది. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. సంక్షేమ వర్గాల బడ్జెట్లో ఈ ఒక్క పథకానికే చేసిన కేటాయింపులు దాదాపు సగం ఉండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలకు కలిపి రూ.33,416.79 కోట్లను సర్కారు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది దాదాపు రూ.1,950 కోట్లు అధికం.
పెరిగిన కల్యాణలక్ష్మి కేటాయింపులు
కల్యాణలక్ష్మి పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాదికి రూ.3,210 కోట్లకు ప్రభుత్వం పెంచింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 12 లక్షల మందికి మంజూరైంది. 2023-24 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమశాఖకు రూ.500 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖకు రూ.260 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ.2,000 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖకు రూ.450 కోట్లు కేటాయించింది.
స్వయం ఉపాధికి రూ.1,533 కోట్లు
సంక్షేమవర్గాల స్వయంఉపాధి పథకాలకు బడ్జెట్లో రూ.1,533.45 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో దళితబంధు మినహా ఇతర పథకాలకు రూ.140 కోట్లు మాత్రమే ఇచ్చింది. గిరిజన ఆర్థిక సహకార సొసైటీ(ట్రైకార్) కింద వివిధ పథకాలకు ప్రస్తుత బడ్జెట్ కంటే రూ.60 కోట్లు పెంచి రూ.523.45 కోట్లు కేటాయించింది. ఇందులో స్వయంఉపాధి పథకాలకు రూ.323.45 కోట్లు, భూమి అభివృద్ధి పథకం(గిరివికాసం)కు రూ.150 కోట్లు, సీఎం ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు ఇచ్చింది.
* ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లకు రూ.300 కోట్ల చొప్పున నిధులిచ్చింది. వీటిలో బీసీ ఫెడరేషన్లకు కలిపి రూ.51.30 కోట్లు కేటాయించింది. గీత కార్మికుల సంక్షేమానికి రూ.30 కోట్లు ఇచ్చింది.
* స్వయంఉపాధి రుణాలకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్కు రూ.2.57 కోట్ల నుంచి రూ.120 కోట్లకు, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థకు రూ.28.31 కోట్ల నుంచి రూ.150 కోట్లకు కేటాయింపులను పెంచింది.
గురుకులాలకు రూ.2,289 కోట్లు
సంక్షేమ గురుకుల సొసైటీలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు. అత్యధికంగా 329 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి రూ.397.50 కోట్లు ఇవ్వగా.. ఎస్సీ గురుకులాలకు రూ.1,145.86 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.522.8 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ.222.92 కోట్లు ఇచ్చారు.
విదేశీవిద్య పథకానికి రూ.273 కోట్లు
విదేశీవిద్య పథకానికి అన్ని సంక్షేమశాఖల్లోనూ నిధుల కేటాయింపులు పెరిగాయి. మైనార్టీ విద్యార్థుల నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.118 కోట్లకు, బీసీల కోసం మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీవిద్య పథకానికి రూ.60 కోట్ల నుంచి రూ.70.80 కోట్లకు పెంచింది. ఎస్సీలకు అంబేడ్కర్ విదేశీవిద్య పథకం కింద రూ.20 కోట్లు పెంచి రూ.65 కోట్లు కేటాయించింది. ఎస్టీలకు రూ.20 కోట్లు ఇవ్వనుంది.
బోధన రుసుములు, ఉపకారానికి రూ.2,850 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలకు నిధులు పెరిగాయి. పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి మొత్తం రూ.2,850.37 కోట్లు కేటాయించారు.
* తాజా బడ్జెట్లో బీసీ సంక్షేమశాఖకు ఉపకార వేతనాల బడ్జెట్ను రూ.250 కోట్లు పెంచుతూ రూ.1,568.65 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమశాఖకు రూ.605.26 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖకు రూ.369.66 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖకు రూ.306.8 కోట్లు ఇచ్చింది.
దళితబంధుతో 1.77 లక్షల మందికి లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి బడ్జెట్లో భారీగా రూ.17,700 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.77 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి రూ.10 లక్షల చొప్పున యూనిట్లు మంజూరు చేయనుంది. ప్రస్తుత(2022-23) ఆర్థిక సంవత్సరంలో తొలుత నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారులకు మంజూరు లక్ష్యంగా ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నియోజకవర్గానికి 500 మందికి తగ్గిస్తూ బడ్జెట్ అంచనాలను రూ.11 వేల కోట్లకు పరిమితం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసులు అక్కర్లేదని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని, విధివిధానాలను జారీ చేయాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది ఎంపిక నిలిచిపోయింది. ఈ ఏడాది కేటాయించిన రూ.17,700 కోట్లలో రూ.2 వేల కోట్లను విడుదల చేసినప్పటికీ.. రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ