అడవుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రథమం
అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు.
ఈనాడు, హైదరాబాద్: అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. 2015లో తెలంగాణ 19,854 చదరపు కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా.. 2019 నాటికి 20,582 చదరపు కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి 21,214 చదరపు కి.మీ.లకు చేరుకుంది. 2019-21 కాలంలో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కి.మీ.(3.07 శాతం) అడవులు విస్తరించాయి. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో పెరుగుదల 1,540 చదరపు కి.మీ.లు(0.22 శాతం) మాత్రమే నమోదు కావడం గమనార్హం.
అడవుల ఖిల్లా.. భద్రాద్రి జిల్లా
రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. జిల్లాలో 4,311.38 చదరపు కి.మీ.లలో అడవులు విస్తరించాయి. 2,939.15 చదరపు కి.మీ.(10.89 శాతం)తో ములుగు రెండో స్థానంలో.. 2,496.68 చదరపు కి.మీ.(9.26 శాతం)తో నాగర్కర్నూల్ మూడో స్థానంలో ఉన్నాయి. జిల్లా భూభాగంలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా ములుగు(71.22 శాతం) నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం(61.45%), ఆసిఫాబాద్(54.45%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం
* 2015 నుంచి ఇప్పటివరకు కొత్త పరిశ్రమల నిర్వహణకు టీఎస్ఐపాస్ అనుమతుల్లో మేడ్చల్ జిల్లా 21.2 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి(8.01%), రంగారెడ్డి(7.54%) ఉన్నాయి.
* రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా(32.15 శాతం)లోనే నమోదయ్యాయి. నల్గొండలో 11.17, కొత్తగూడెంలో 9.05 శాతం ఉన్నాయి.
* ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా 56.66 శాతంతో తొలి స్థానంలో ఉంది. వరంగల్(11.12%), సంగారెడ్డి(8.04%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రంలో లక్ష కి.మీ. రహదారులు
రాష్ట్రంలో రోడ్ల పొడవు లక్ష కిలోమీటర్లు దాటింది. మొత్తం 1,09,260 కి.మీ. పొడవు రోడ్లున్నాయి. అందులో 61.80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర రహదారులు(హైవేలు), జిల్లా రోడ్లు 25.39 శాతం ఉండగా.. జాతీయ రహదారులు 4.56 శాతమున్నాయి. మొత్తం రోడ్ల పొడవులో జీహెచ్ఎంసీలో 8.25 శాతం ఉండటం విశేషం.
సైకాలజీలో పీజీ చేసిన 28 మంది ‘చర్లపల్లి’ ఖైదీలు
చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో 28 మంది ఖైదీలు ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసి.. పట్టాలు పొందారు. రాష్ట్రంలో సబ్, జిల్లా జైళ్లు కలిపి 47 ఉన్నాయి. వాటిలో 7,845 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉండగా.. 2022 డిసెంబరు 11 నాటికి విచారణ, నిర్బంధ, శిక్ష పడిన ఖైదీలు 6,786 మంది ఉన్నారు.
సర్కారు బడులు నల్గొండలో ఎక్కువ
ములుగు జిల్లాలో అతి తక్కువగా 353 ప్రభుత్వ పాఠశాలలుండగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,483 బడులున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ములుగులో అతి తక్కువగా 47 ఉండగా.. అత్యధికంగా హైదరాబాద్లో 2,156 ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలున్న మొదటి మూడు జిల్లాలుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం 2020-21లో 43.47 ఉండగా.. 2021-22లో 49.77కు పెరగడం గమనార్హం. 2019-20లో 42.91 శాతం మందే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2021-22లో సర్కారు బడుల్లో అత్యధిక శాతం విద్యార్థులు నమోదు కావడం విశేషం.
మరికొన్ని ముఖ్యాంశాలు..
* రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు శాఖల్లో 46%(2,732) నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. మిగిలిన వాటిలో సెమీ అర్బన్ ప్రాంతాల్లో 24%(1,408) ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 30%(1,818) ఉన్నాయి.
* మాంసం ఉత్పత్తి గత తొమ్మిదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరిగింది. 2013-13లో 2.30 లక్షల టన్నులు ఉండగా.. 2021-22 నాటికి 10.14 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో 55, గుడ్ల ఉత్పత్తిలో 71 శాతం వృద్ధి నమోదైంది.
* పోలీస్ బలగాల సంఖ్య 2015లో 52,116 ఉండగా.. 2019 నాటికి 77,680కి చేరింది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది.
* రాష్ట్రంలోని మొత్తం కార్మికుల్లో 33.21 శాతం మంది సేవారంగంలో పనిచేస్తున్నారు. ఈ అంశంలో జాతీయ సగటు 29.64 శాతమే. రాష్ట్రంలో సేవారంగంలో ఉన్నవారిలో 39.75 శాతం మంది వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. మరో 21.04 శాతం మంది రవాణా, స్టోరేజీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నారు. అర్బన్ కార్మికుల్లో 63.22 శాతం మంది సేవా రంగంలో పనిచేస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 18.28 శాతం మంది ఈ రంగంలో ఉన్నారు.
* తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 31 నాటికి 13.79 లక్షల ఉత్తర్వులను జారీ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ (జీవోఐర్) పోర్టల్ ద్వారా సచివాలయంలోని శాఖలు 1,63,896, వాణిజ్య పన్నులశాఖ 4,26,590, ట్రాన్స్కో 34,774, సచివాలయ శాఖలు ఎఫ్ఎంఎస్లో జారీ చేసినవి 6,89,819, ఎస్వోఎంఎస్ ద్వారా 64,813 ఉత్తర్వులు జారీ చేశాయి.
* 2014 జూన్ నుంచి 2023 జూన్ వరకు నమోదైన ఈ-లావాదేవీల్లో (ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్) దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు రాష్ట్రంలో 1,58,241 లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో ఉన్న ఏపీలో 1,41,147, మూడో స్థానంలో ఉన్న కేరళలో 1,40,709 నమోదయ్యాయి. బిహార్లో 11,267, మహారాష్ట్రలో 15,819 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది.